
గొప్ప సంఘ సంస్కర్త బసవణ్ణ
సాక్షి, బళ్లారి: మహా మానవతావాది, గొప్ప సంఘ సంస్కర్త విశ్వగురు బసవణ్ణ అని పలువురు వక్తలు కొనియాడారు. బుధవారం బసవణ్ణ జయంతిని నగరంతో పాటు జిల్లా వ్యాప్తంగా కన్నుల పండువగా ఆచరించారు. జిల్లా యంత్రాంగం, వీరశైవ సమాజ ప్రముఖులు విశ్వగురు బసవణ్ణ విగ్రహానికి పూలమాలలు వేసి పూజలు చేసి నివాళులు అర్పించారు. నగరంలోని మోతీ సర్కిల్ వద్ద వెలసిన బసవేశ్వర విగ్రహానికి పూజలు చేసిన అనంతరం వక్తలు మాట్లాడుతూ మహా మానవతావాది బసవేశ్వర ఆచార విచారాలను ప్రతి ఒక్కరూ పాటించాల్సిన అవసరం ఉందని కొనియాడారు. జిల్లాధికారి ప్రశాంత్కుమార్ మిశ్రా, ఎమ్మెల్యేలు నాగేంద్ర, నారా భరత్రెడ్డి, జిల్లా ఎస్పీ శోభారాణి, మేయర్ నందీష్, పలువురు కార్పొరేటర్లు పాల్గొన్నారు. అంతకు ముందు ఎమ్మెల్యేలు నారా భరత్రెడ్డి, నాగేంద్ర తదితరులు నగరంలో బైక్ ర్యాలీని నిర్వహించారు.
రూ.1.5 కోట్లతో బసవణ్ణ విగ్రహం ఏర్పాటు
నగరంలోని మోకా రోడ్డులోని కేఈబీ సర్కిల్ను బసవేశ్వర సర్కిల్గా నామకరణం చేస్తూ గుర్రం మీద బసవణ్ణ స్వారీ చేస్తున్న విధంగా రూ.1.5 కోట్లతో అద్భుతమైన విగ్రహం ఏర్పాటుకు ఎమ్మెల్యేలు నారా భరత్రెడ్డి, నాగేంద్ర, వీరశైవ సమాజ ప్రముఖులు భూమి పూజ చేశారు.
అంతటా బసవ జయంతి
విశ్వగురు బసవేశ్వరుని జయంతిని బుధవారం గ్రామాలు, పట్టణాలు, నగరాల్లో అంతటా అంగరంగ వైభవంగా నిర్వహించారు. మాజీ మంత్రి శ్రీరాములు ఆధ్వర్యంలో ఆయన నివాస గృహంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో బసవణ్ణ విగ్రహానికి పూజలు చేసి బసవ జయంతిని ఆచరించారు. దళిత సంఘర్షణ సమితి ఆధ్వర్యంలో బసవణ్ణ విగ్రహానికి లిడ్కర్ అధ్యక్షుడు ముండ్రిగి నాగరాజు పూలమాలలు వేశారు. అలాగే జేడీఎస్ కార్యాలయంలో ఆ పార్టీ జిల్లాధ్యక్షుడు మీనళ్లి తాయణ్ణ తదితరులు పాల్గొని బసవ జయంతిని ఆచరించారు. డీఎస్ఎస్ ఆధ్వర్యంలో, మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో ఘనంగా బసవ జయంతిని ఆచరించారు.
కులవివక్షపై బసవణ్ణ ఆనాడే గళమెత్తారు
బళ్లారి రూరల్ : మహిళా అసమానత, కుల, మత వివక్షలపై బసవణ్ణ ఆనాడే గళమెత్తారని కన్నడ సంస్కృతి శాఖ రిటైర్డ్ ఏడీ డాక్టర్ చోరనూరు కొట్రప్ప తెలిపారు. బీఎంఆర్సీ వైద్యభవన్లో బుధవారం బసవణ్ణ జయంతిలో పాల్గొని ఆయన మాట్లాడారు. ఫోరెన్సిక్ విభాగం ప్రొఫెసర్ డాక్టర్ రవిశంకర్, బీఎంఆర్సీ డీన్ డాక్టర్ గంగాధరగౌడ, ప్రిన్స్పాల్ డాక్టర్ మంజునాథ్, సూపరింటెండెంట్ డాక్టర్ ఇందుమతి, డాక్టర్ బసవరాజగౌడ, డాక్టర్ ఆదర్శ్, డాక్టర్ గడ్డి దివాకర్, డాక్టర్ రాజశేఖరగౌడ, డాక్టర్ ఎన్.కొట్రేశ్ తదితర వైద్యులు, జూనియర్ వైద్యులు, నర్సింగ్ విద్యార్థులు పాల్గొన్నారు.
బసవణ్ణ ఆదర్శాలు అనుసరణీయం
రాయచూరు రూరల్: మహా మానవతావాది బసవణ్ణ ఆదర్శాలను ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలని రాష్ట్ర చిన్న నీటిపారుదల శాఖ మంత్రి బోసురాజు అన్నారు. బుధవారం బసవేశ్వర సర్కిల్లో జరిగిన బసవణ్ణ 892వ జయంతిని పురస్కరించుకొని ఆయన ప్రతిమకు పూలమాలలు వేసి మాట్లాడారు. ప్రతిమకు శాంతమల్ల శివాచార్య స్వామీజీ, జిల్లాధికారి నితీష్, లోక్సభ సభ్యుడు కుమారనాయక్, శాసన సభ్యుడు శివరాజ పాటిల్, ఏఎస్పీ హరీష్, సమాజ అధ్యక్షుడు శరణ భూపాల్ నాడగౌడ తదితరులు పూలమాలలు వేశారు.
సామూహిక వివాహాలు పేదలకు వరం
హొసపేటె: సామూహిక వివాహాలు పేదలకు వరంలాంటివని విజయనగర జిల్లాధికారి దివాకర్ తెలిపారు. బుధవారం నగరంలో కొట్టూరు స్వామి మఠంలో బసవ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన సామూహిక వివాహ కార్యక్రమంలో పాల్గొని ఆయన మాట్లాడారు. కొట్టూరు సంస్థాన మఠం జగద్గురు బసవలింగ మహాస్వామీజీ మాట్లాడుతూ ఈసారి సర్వధర్మ ఉచిత సామూహిక వివాహాలకు 18 జంటలు హాజరయ్యారన్నారు. అనంతరం వేద మంత్రాల సాక్షిగా పెళ్లిళ్లు జరిపించి నూతన జంటలను ఆశీర్వదించారు. అంతకు ముందు బసవేశ్వర సర్కిల్లోని బసవణ్ణ ప్రతిమకు పూలమాలలు వేశారు. అసిస్టెంట్ కమిషనర్ వివేక్, తహసీల్దార్ శృతి, డీఎస్పీ మంజునాథ్, వీరశైవ సమాజ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.
విశ్వ గురు తత్వాలు ఆదర్శనీయం
జయంతిలో పలువురు వక్తల వెల్లడి

గొప్ప సంఘ సంస్కర్త బసవణ్ణ

గొప్ప సంఘ సంస్కర్త బసవణ్ణ

గొప్ప సంఘ సంస్కర్త బసవణ్ణ

గొప్ప సంఘ సంస్కర్త బసవణ్ణ

గొప్ప సంఘ సంస్కర్త బసవణ్ణ

గొప్ప సంఘ సంస్కర్త బసవణ్ణ

గొప్ప సంఘ సంస్కర్త బసవణ్ణ