ఆయుర్వేద ఆస్పత్రి ప్రారంభం | - | Sakshi
Sakshi News home page

ఆయుర్వేద ఆస్పత్రి ప్రారంభం

Jun 1 2025 12:24 AM | Updated on Jun 1 2025 12:24 AM

ఆయుర్

ఆయుర్వేద ఆస్పత్రి ప్రారంభం

బళ్లారిటౌన్‌: జిల్లాలోని కురుగోడు తాలూకా కోళూరు గ్రామంలో నూతనంగా నిర్మించిన ప్రభుత్వ ఆయుర్వేద ఆస్పత్రిని కంప్లి ఎమ్మెల్యే జేఎన్‌.గణేష్‌ శనివారం ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పురాతన కాలం నుంచి వచ్చిన మన ఆయుర్వేద వైద్యం వల్ల ఎలాంటి దుష్పరిణామాలు కలగవన్నారు. ఈ మందుల వాడటం వల్ల రోగాలు పూర్తిగా నయం అయ్యే అవకాశం ఉంటుందన్నారు. దీన్ని స్థానికులు సక్రమంగా సద్వినియోగం చేసుకోవాలన్నారు. వైద్యులు కూడా రోగులతో సౌజన్యంగా నడుచుకొని సేవలు అందించాలన్నారు. కోళూరు జీపీ అధ్యక్షురాలు దొడ్డబసమ్మ, ఉపాధ్యక్షుడు చెన్నప్ప, జిల్లా ఆయుష్‌ అధికారి ఎన్‌.విరుపాక్షప్ప, వైద్యాధికారి కేపీ కళ్యాణి తదితరులు పాల్గొన్నారు.

ఆక్యుప్రెషర్‌లో బంగారు పతకం

రాయచూరు రూరల్‌: బెంగళూరులో జరిగిన బసవ ఆక్యు ప్రత్యామ్నాయ మందుల అకాడమీ ఆధ్వర్యంలో రాయచూరుకు చెందిన రాజా శంకర్‌ ఆక్యుప్రెషర్‌లో బంగారు పతకం అందుకున్నారు. ఈ సందర్భంగా అకాడమీ అధ్యక్షుడు బసవరాజ్‌, హెచ్‌.భోజరాజు, తమిళనాడు హిలర్‌ అధ్యక్షుడు డా.మణికణ్ణన్‌లున్నారు.

ఎమ్మెల్సీపై చర్యలకు డిమాండ్‌

రాయచూరు రూరల్‌: కలబుర్గి జిల్లాధికారి ఫౌజియ తరన్నంను నిందించిన ఎమ్మెల్సీ రవి కుమార్‌పై చర్యలు తీసుకోవాలని అంజుమన్‌–ఏ–రాయచూరు డిమాండ్‌ చేసింది. శనివారం అదనపు జిల్లాధికారి కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళనలో సంచాలకుడు సయ్యద్‌ అమీనుల్లా హసన్‌ మాట్లాడారు. బీజేపీ ఎమ్మెల్సీ జిల్లాధికారిని అవమానించడం తగదన్నారు. ఆయనపై చర్యలు చేపట్టాలని కోరుతూ అదనపు జిల్లాధికారి శివానంద ద్వారా రాష్ట్రపతికి వినతిపత్రం సమర్పించారు.

అధిక ఫీజుల వసూలు తగదు

రాయచూరు రూరల్‌: జిల్లాలోని ప్రైవేట్‌ పాఠశాలల్లో అధికంగా డొనేషన్లు, ఫీజులు వసూలు చేయడం తగదని జనసేవా ఫౌండేషన్‌ అధ్యక్షుడు జావిద్‌ఖాన్‌ పేర్కొన్నారు. శనివారం మాన్విలోని పాత్రికేయుల భవనంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. మధ్య తరగతి పిల్లలు ప్రైవేట్‌ పాఠశాలల్లో చదవాలంటే రూ.లక్షల్లో డొనేషన్లు, వేలల్లో ఫీజులు వసూలు చేస్తున్నా జిల్లా, తాలూకా విద్యా శాఖ అధికారులు తమకేమీ పట్టనట్లు ఉన్నారన్నారు. అధిక ఫీజులు వసూలు చేసే పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ జిల్లా విద్యా శాఖాధికారులను డిమాండ్‌ చేశారు.

జనౌషధి కేంద్రాల

మూసివేత సరికాదు

రాయచూరు రూరల్‌: ప్రభుత్వ ఆస్పత్రుల ఆవరణలో కేంద్ర ప్రభుత్వం నెలకొల్పిన జనౌషధి కేంద్రాలను మూసివేయాలని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరికాదని బీజేపీ నాయకులు ఆరోపించారు. శనివారం బాగల్‌కోటె జిల్లా ఇలకల్‌ ప్రభుత్వాస్పత్రి వద్ద చేపట్టిన ఆందోళనలో ఇలకల్‌ నగర అధ్యక్షుడు అరవింద్‌ మాట్లాడారు. పేదలు దుబారా వ్యయంతో కూడిన మందులు కొనుగోలు చేయడం కష్టమని భావించి ప్రధానమంత్రి జనౌషధి కేంద్రాలను ప్రారంభించి వారికి సౌకర్యం కల్పించారన్నారు. కాంగ్రెస్‌ సర్కార్‌ వాటిని మూసివేయడానికి తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని నల్ల బ్యాడ్జీలు ధరించి మౌన ప్రదర్శన చేశారు. ఆందోళనలో తృప్తి సాలిమఠ, మల్లికార్జున, శ్యాం సుందర్‌, బసప్ప, చంద్రశేఖర్‌, నాడగౌడ, ప్రకాష్‌, విజయ్‌ గిరెడ్డి, నాగేష్‌, శ్రీనివాస్‌, శివరాజ్‌, వీరేష్‌, పరశురామ్‌, సూగూరేష్‌, రాజేంద్రలున్నారు.

ఆయుర్వేద ఆస్పత్రి ప్రారంభం 1
1/4

ఆయుర్వేద ఆస్పత్రి ప్రారంభం

ఆయుర్వేద ఆస్పత్రి ప్రారంభం 2
2/4

ఆయుర్వేద ఆస్పత్రి ప్రారంభం

ఆయుర్వేద ఆస్పత్రి ప్రారంభం 3
3/4

ఆయుర్వేద ఆస్పత్రి ప్రారంభం

ఆయుర్వేద ఆస్పత్రి ప్రారంభం 4
4/4

ఆయుర్వేద ఆస్పత్రి ప్రారంభం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement