పొగ.. ఆరోగ్యానికి సెగ | - | Sakshi
Sakshi News home page

పొగ.. ఆరోగ్యానికి సెగ

Jun 1 2025 12:24 AM | Updated on Jun 1 2025 12:24 AM

పొగ..

పొగ.. ఆరోగ్యానికి సెగ

హొసపేటె: దురలవాట్లకు బానిసయ్యే ముందు మీ జీవితం, జీవనోపాధి విలువలను అర్థం చేసుకోవడం ద్వారా మాత్రమే మీరు పొగాకు ఉత్పత్తులకు దూరంగా ఉండగలరని సివిల్‌ జడ్జి ప్రశాంత్‌ నాగలాపుర అన్నారు. ప్రపంచ పొగాకు నిరోధక దినోత్సవాన్ని పురస్కరించుకుని నగరంలో నిర్వహించిన అవగాహన మార్చ్‌ను శనివారం ఆయన జెండా ఊపి ప్రారంభించి మాట్లాడారు. యువత పొగాకు, నికోటిన్‌ వంటి ఉత్పత్తులపై ఎక్కువగా ఆకర్షితులవుతున్నారన్నారు. దేశంలో 267 మిలియన్లకు పైగా పొగాకు వినియోగదారులు ఉన్నారన్నారు. ప్రతి సంవత్సరం 13.5 లక్షలకు పైగా ప్రజలు పొగాకు సంబంధిత వ్యాధులతో మరణిస్తున్నారన్నారు. హాస్యాస్పదంగా పొగాకు వినియోగదారుల్లో 47.6 శాతం మంది గ్రామీణ ప్రాంతాలకు చెందిన వారు ఉన్నారన్నారు. కర్ణాటకలో 22.8 శాతం మంది వ్యక్తులు ఏదో ఒక రకమైన పొగాకు ఉత్పత్తులను వినియోగిస్తున్నారన్నారు. ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపడానికి పొగాకు ఉత్పత్తుల చీకటి ఉద్దేశ్యాల గురించి ప్రజలు తెలుసుకోవాలన్నారు. జిల్లాను పొగాకు రహితంగా మార్చడంలో ప్రజల సహకారం చాలా ముఖ్యం అన్నారు. పొగాకు వాడకం వల్ల గుండె జబ్బులు, క్యాన్సర్‌ వస్తున్నాయి. నోరు, రక్తనాళాల నష్టం, తల, మెడ క్యాన్సర్‌, గొంతు క్యాన్సర్‌, స్వరపేటిక, మెదడు, అన్నవాహిక, ఊపిరితిత్తులు, మూత్రపిండాలు, రొమ్ము క్యాన్సర్‌కు కారణమవుతుందన్నారు. పొగాకు వాడకం వల్ల కలిగే దుష్ప్రభావాల గురించి ప్రజల్లో అవగాహన తేవాలన్నారు. ఈ సందర్భంగా జిల్లా వైద్యాధికారి శంకర్‌ నాయక్‌, వైద్యులు భాస్కర్‌, వినోద్‌ తదితరులు పాల్గొన్నారు.

దురలవాట్లకు బానిస కావద్దు

బళ్లారిటౌన్‌: దురలవాట్లు, పొగాకు ఉత్పత్తుల సేవనానికి దూరంగా ఉండి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని డీహెచ్‌ఓ వై.రమేష్‌బాబు పేర్కొన్నారు. శనివారం తన కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన ప్రపంచ పొగాకు రహిత దినోత్సవంలో ఆయన పాల్గొని మాట్లాడారు. పొగాకులో దాదాపు 2000 రసాయనిక అంశాలు దాగి ఉన్నాయన్నారు. అది మనిషి ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందన్నారు. ఇందులో ముఖ్యంగా కిడ్నీలు, నరాల సమస్యలు, క్యాన్సర్‌ వంటి వ్యాధులు ఉత్పత్తి అవుతాయన్నారు. పొగాకు వినియోగాన్ని తగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనే పథకాలను రూపొందించిందన్నారు. విద్యా సంస్థల వద్ద 100 మీటర్లలోపు పొగాకు అమ్మకం నిషేధం అని, అధికారులు కూడా మరింత జాగ్రత్త చర్యలు చేపట్టాలన్నారు. అధికారులు ఈశ్వర్‌ దానప్ప, ఇంద్రాణి, జబిన్‌తాజ్‌, శ్రావణి, రాఘవేంద్ర, గోవిందప్ప, విరుపాక్షి, అంబదాసు, శివకుమార్‌, ఉమా మహేశ్వరి, సవిత తదితరులు పాల్గొన్నారు.

పొగాకు సేవనానికి దూరంగా ఉండండి

సివిల్‌ జడ్జి ప్రశాంత్‌ నాగలాపుర పిలుపు

పొగ.. ఆరోగ్యానికి సెగ 1
1/1

పొగ.. ఆరోగ్యానికి సెగ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement