
నేత్రపర్వంగా దీపా మేళా తనారతి
రాయచూరు రూరల్: దక్షిణ భారత దీపా మేళా తనారతి కార్యక్రమం కళ్యాణ కర్ణాటకలో అత్యంత వైభవంగా ముగిసింది. మంగళవారం రాత్రి కలబుర్గి జిల్లా చిత్తాపుర తాలూకాలోని నాలవార కోరి సిద్దేశ్వర మఠంలో తోటేంద్ర శివాచార్య మహాస్వామీజీ ఆధ్వర్యంలో తనారతి నిర్వహించారు. భక్తుల కోరికలు తీర్చే ఇష్ట దైవంగా భావించే నాలవార కోరి సిద్దేశ్వర స్వామిగా భావించి భక్తులు తనారతి చేయడం ఆనవాయితీగా వస్తోంది.
జంబునాథ ఆలయం రోడ్డుకు మరమ్మతులు
హొసపేటె: జంబునాథ స్వామి ఆలయం వద్ద రోడ్డు నిర్మాణ పనులు జరుగుతున్నందున బైకులు, కార్లు, లారీలు మొదలైన అన్ని రకాల వాహనాల సంచారం ఆ రోడ్డులో స్తంభింపజేశారు. ఈనేపథ్యంలో భక్తులు భక్తులు సహకరించాలని కార్యనిర్వహక అధికారులు తెలిపారు.
ప్రజల సహకారంతో
అభివృద్ధి సాకారం
రాయచూరు రూరల్: తాలూకా సమగ్ర అభివృద్ధికి ప్రజల సహకారం అవసరమని విధాన పరిషత్ సభ్యుడు బసనగౌడ బాదర్లి పేర్కొన్నారు. బుధవారం సింధనూరు తాలూకాలో రూ.40 లక్షలతో చేపట్టనున్న మూడు హాస్టల్ భవనాల నిర్మాణానికి భూమిపూజ చేసి ఆయన మాట్లాడారు. తాలూకాను సుందరంగా తీర్చిదిద్దడానికి పాటుపడతామన్నారు. యూసఫ్, వీరేష్, హన్మంతు, శహబాజ్, చెన్నబసవ, చంద్రశేఖర్, ప్రశాంత్, సంతోష్, అమరేష్లున్నారు.
బెళగావి ఘటనలో ఇద్దరు కానిస్టేబుళ్ల సస్పెన్షన్
రాయచూరు రూరల్: రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్దరామయ్య సోమవారం బెళగావిలో జరిగిన బహిరంగ సభలో పాల్గొన్న సందర్భంగా బీజేపీ కార్యకర్తలు నల్ల జెండాలు ప్రదర్శించారు. ఈనేపథ్యంలో పోలీసుల నిర్లక్ష్యం వల్లే ప్రసంగానికి అడ్డు తగిలిన అంశాన్ని దృష్టిలో ఉంచుకొని ఇద్దరు కానిస్టేబుళ్లను సస్పెండ్ చేశారు. బెళగావి ఉత్తర రేంజ్ ఐజీపీ చేతన్ిసింగ్ రాథోడ్ ఖడే బజార్ పోలీస్ కానిస్టేబుల్ బీ.ఏ.నౌకిడి, క్యాంప్ పోలీస్ కానిస్టేబుల్ మల్లప్ప హెడిగినాళలను సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఆందోళన చేస్తున్న సమయంలో బీజేపీ మహిళా కార్యకర్తలను సభలోకి వెళ్లకుండా అడ్డుకోనందుకు కానిస్టేబుళ్లను సస్పెండ్ చేశారు.
బాలుడు అదృశ్యం
హొసపేటె: విజయనగర జిల్లా కూడ్లిగి తాలూకాలోని హొసహళ్లి పోలీస్ స్టేషన్ పరిధిలో 15 ఏళ్ల వయస్సుగల వరుణ్ కుమార్(హొన్నూర్) అనే బాలుడు అదృశ్యమైనట్లు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. గోధుమ రంగు శరీరఛాయ, గుండ్రని ముఖం, 4.5 అడుగుల ఎత్తు కలిగి, నీలం రంగు చొక్కా, గోధుమ రంగు షార్ట్స్ ధరించి కన్నడలో మాట్లాడగలడని తెలిపారు. ఏప్రిల్ 27న బాలుడు ఇంటి నుంచి వెళ్లి కనిపించకుండా పోయాడు. తప్పిపోయిన బాలుని గురించి సమాచారం తెలిసిన వారు హొసహళ్లి పోలీస్ స్టేషన్లో లేదా 8073276896కు సంప్రదించాలని పోలీస్ సబ్ఇన్స్పెక్టర్ ఒక ప్రకటనలో తెలిపారు.
రోడ్ల అభివృద్ధికి పెద్దపీట
రాయచూరు రూరల్: తాలూకాలో గ్రామీణ రోడ్ల అభివృద్ధి ప్రాముఖ్యత కల్పిస్తామని గ్రామీణ విధానసభ సభ్యుడు బసనగౌడ దద్దల్ పేర్కొన్నారు. బుధవారం రాయచూరు తాలూకాలోని కుర్డి, రాజోళి, జూకూరుల్లో రూ.కోటితో తారు రోడ్డు నిర్మాణ పనులకు భూమిపూజ చేసి మాట్లాడారు. భవిష్యత్తులో గ్రామీణ రహదారులకు మరింత ప్రాధాన్యత ఇస్తామన్నారు.

నేత్రపర్వంగా దీపా మేళా తనారతి

నేత్రపర్వంగా దీపా మేళా తనారతి

నేత్రపర్వంగా దీపా మేళా తనారతి

నేత్రపర్వంగా దీపా మేళా తనారతి