
పరిసరాల శుభ్రతతో మలేరియాకు అడ్డుకట్ట
హొసపేటె: ప్రతి ఒక్కరూ తమ ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకుంటే మలేరియాను నివారించవచ్చని కూడ్లిగి టీహెచ్ఓ ప్రతీప్కుమార్ అన్నారు. ప్రపంచ మలేరియా దినోత్సవ సందర్భంగా విజయనగరం జిల్లా కూడ్లిగి పట్టణంలోని ప్రభుత్వ ఆస్పతి ఆవరణలో ఏర్పాటు చేసిన అవగాహన జాతాను ఆయన ప్రారంభించి మాట్లాడారు. అనాఫిలిస్ జాతికి చెందిన ఆడ దోమల ద్వారా సంక్రమించే వ్యాధి మలేరియా అని, దీని గురించి ప్రజలకు అవగాహన కల్పించడం ఎంతో అవసరమన్నారు. ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవం, దోమ తెరలు వినియోగించడం ద్వారా మలేరియాకు దూరంగా ఉండచవ్చన్నారు. అనంతరం రాఘవేంద్ర పారామెడికల్ విద్యార్థులు ప్రధాన వీధుల్లో ర్యాలీగా వెళ్లి మలేరియా నివారణపై ప్రజలకు అవగాహన కల్పించారు. చిత్రలేఖనాల ద్వారా అవగాహన కల్పించారు. సీనియర్ హెల్త్ ఇన్స్పెక్టర్లు జగదీష్, వహాబ్, గురుమూర్తి, హెల్త్ ఇన్స్పెక్టర్ కే.సునీత, మహేష్, మలేరియా సూపర్ వైజర్ కొట్రేష్ తదితరులు పాల్గొన్నారు.