హసి కరగ కమనీయం | - | Sakshi
Sakshi News home page

హసి కరగ కమనీయం

Apr 5 2026 8:36 AM | Updated on Apr 5 2026 8:36 AM

బొమ్మనహళ్లి: బెంగళూరు శివార్లలో ఆనేకల్‌ పట్టణంలోని శ్రీ ధర్మరాయస్వామి ఆలయంలో ద్రౌపదమ్మ దేవి హసి కరగ ఉత్సవం శుక్రవారం అర్ధరాత్రి నుంచి వేలాదిమంది భక్తుల మధ్య వైభవంగా జరిగింది. సంతేమాలలోని ధర్మరాయస్వామి ఆలయం నుంచి పూజారి రమేష్‌ కరగనెత్తుకుని శనివారం తెల్లవారుజామున 3:20 గంటలకు బయటకు వచ్చారు. నగర వీధుల గుండా కరగధారి ఆర్భాటం కొనసాగింది. కరగధారి నృత్యాలు చేస్తుండగా ఆనందం పట్టలేక భక్తులు కూడా చిందులేశారు.

భక్తులకు చీపురు దెబ్బలు

ఈ సందర్భంగా ధర్మరాయస్వామి ఆలయం పక్కన డబ్బులిచ్చి చీపుర్లతో దెబ్బలు తిని, అభిమన్యు పద్మవ్యూహం కోటను ఛేదించే కోట పోరాటం జరిగింది. పలువురు భక్తులు డబ్బులు ఇచ్చి చీపురుతో దెబ్బలు తిన్నారు. దీని వల్ల అంతా మంచే జరుగుతుందని విశ్వసిస్తారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement