
ప్రదర్శనలో ఉంచిన మైనపు విగ్రహం
మైసూరు: మైసూరు నగరంలో ప్రదర్శనలో ఉంచిన బాహుబలి నటుడు ప్రభాస్ మైనపు విగ్రహం అభిమానులకు అసహనం కలిగిస్తోంది. అందులో ప్రభాస్ పోలికలు లేకపోవడమే కారణం. సెలెబ్రెటీ వ్యాక్స్ మ్యూజియంలో బాహుబలి సినిమాలో మాదిరిగా ఉండే ప్రభాస్ నిలువెత్తు బొమ్మని ఉంచారు. బాహుబలి దుస్తులను బట్టి పరిశీలించి చూస్తే అది బాహుబలి ప్రభాస్ అనుకుంటారు తప్ప ముఖంలో తమ హీరో రూపులేఖలు లేవని అభిమానులు అసంతృప్తి వ్యక్తంచేశారు.
ప్రతిమ ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి అసమాధానం వెలిబుచ్చారు. ఈ బొమ్మ మా హీరో కాదని ట్రోల్ చేయడం మొదలైంది. నిర్వాహకులు స్పందిస్తూ విగ్రహం ముఖం ప్రభాస్లా లేదని తమ దృష్టికి రాలేదని, అభ్యంతరం ఉంటే తొలగిస్తామని తెలిపారు.