
మాట్లాడుతున్న నీలకంఠప్ప తదితరులు
బళ్లారిటౌన్: జనతా బజార్ ముందు భాగంలోని కాంప్లెక్స్ లీజ్ రద్దుకు సహకార సంఘాల అధికారి డాక్టర్ రాజేంద్ర ఆదేశించినందున లీజును రద్దు చేస్తున్నట్లు జనతా బజార్ అధ్యక్షుడు జీ.నీలకంఠప్ప, జనరల్ మేనేజర్ షాకీరబాను తెలిపారు. గురువారం సంఘం కార్యాలయంలో విలేకరులతో వారు మాట్లాడుతూ 2009లో పోలా విక్రమ్ లక్ష్మీ అసోసియేషన్స్ 30 ఏళ్ల లీజ్కు ఇచ్చారని, అయితే ఇంతవరకు అగ్రిమెంట్ కాలేదన్నారు. ఈ స్థలాన్ని వారు సబ్ లీజ్కు ఇతరులకు ఇస్తున్నారన్నారు. అయితే ఇంతవరకు నోటీసులు ఇస్తున్న వారు అగ్రిమెంట్ చేసుకోక పోవడంతో లీజ్ను రద్దు చేస్తున్నట్లు తెలిపారు. జనతాబజార్ 2.5 ఎకరాల విస్తీర్ణంలో ఉందని, దీన్ని సంవత్సరానికి రూ.36 లక్షల బాడుగకు ఇస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 23న జనరల్ బాడీ సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సమావేశంలో డైరెక్టర్లు వెంకటేష్ హెగ్డె, వెంకటస్వామి, కాత్యాయిని మైత్రి, విజయ్కుమార్ గౌడ, నరేష్కుమార్లు పాల్గొన్నారు.
సమస్య పరిష్కారానికి కృషి
కంప్లి: సింగటాలూరు ఎత్తిపోతల పథకానికి భూములిచ్చిన రైతులు ఒప్పుకుంటే వెంటనే జిల్లాధికారి ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేసి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోనున్నట్టు హూవినహడగలి ఎమ్మెల్యే కృష్ణానాయక్ తెలిపారు. పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జాయింట్ సర్వే, ఆర్ఆర్కు నాలుగేళ్లు పడుతుందన్నారు. ప్రభుత్వం ప్రకటించిన ధరకు రైతులు ఒప్పుకుంటే పరిహారం అందించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.
హిందీని ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలి
రాయచూరు రూరల్: జాతీయ భాష హిందీని ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలని రిటైర్ట్ ప్రిన్సిపాల్ ప్రభాకర్ అన్నారు. ఆయన గురువారం సోమసుభద్రమ్మ రామనగౌడ మహిళా కళాశాలలో ఏర్పాటు చేసిన హిందీ దివస్ను ప్రారంభించి మాట్లాడారు. రాష్ట్రంలో కన్నడ భాషకు ప్రాధాన్యత ఇస్తూనే హిందీని కూడా మాట్లాడాలన్నారు. 1949లో అధికారికంగా గుర్తింపు పొందిందన్నారు. ప్రిన్సిపాల్ అమరేగౌడ, వెంకటేష్, శ్యాం, హిందీ భాషా ప్రొఫెసర్ డాక్టర్ అరుణ, సురేష్, రాజేంద్ర, దేవిరెడ్డి, గిరిజాలున్నారు.

మాట్లాడుతున్న ఎమ్మెల్యే కృష్ణానాయక్

కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్న దృశ్యం