పోలీసుల వేధింపులు, వ్యక్తి ఆత్మహత్య | - | Sakshi
Sakshi News home page

పోలీసుల వేధింపులు, వ్యక్తి ఆత్మహత్య

Sep 22 2023 12:22 AM | Updated on Sep 22 2023 12:22 AM

బనశంకరి: పోలీసులు వేధిస్తున్నారని ఓ వ్యక్తి డెత్‌నోట్‌ రాసి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడు తలఘట్టపుర నాగరాజ్‌ (47). వివరాలు... సనావుల్లా అనే వ్యక్తి ఆధీనంలో ఉన్న కంపెనీలో నాగరాజ్‌ పనిచేస్తున్నారు. ఈ కంపెనీ పేరుతో నగదు తీసుకుని వంచనకు పాల్పడ్డారని నటరాజ్‌ అనే వ్యక్తి వయ్యాలికావల్‌ పోలీస్‌స్టేషన్‌లో ఇటీవల ఫిర్యాదు చేశారు. కేసుకు సంబంధించి కంపెనీ యజమాని సనావుల్లాకు బదులుగా నాగరాజ్‌ను పోలీసులు తీసుకెళ్లి వేధింపులకు పాల్పడ్డారని ఆరోపణ. దీంతో మనస్తాపం చెందిన నాగరాజ్‌ డెత్‌నోట్‌రాసి బుధవారం తలఘట్టపుర నివాసంలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. డెత్‌నోట్‌లో పోలీసుల పేర్లను కూడా ప్రస్తావించినట్లు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement