
కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖులు
శివమొగ్గ: కెళది శివప్పనాయక కృషి, తోటగారిక విజ్ఞాన విశ్వ విద్యాలయం విద్యార్థులకు వ్యవసాయం గురించి పాఠాలు బోధించడానికి మాత్రమే కాదు, రైతులకు కూడా ఉపయుక్తంగా ఉండాలని మాజీ మంత్రి కాగోడు తిమ్మప్ప అన్నారు. గురువారం ఈ వర్సిటీలో నిర్వహించిన 11వ సంస్థాపన దినోత్సవాన్ని ఆయన ప్రారంభించారు. రైతులు ఏ భూమిలో ఎటువంటి పంటలు వేయాలి, తదితర మెళకువలను బోధించాలని సూచించారు. కనీసం పంచాయతీలో 50 మంది రైతులను చైతన్యవంతులను చేయాలన్నారు. అప్పుడు వ్యవసాయ వర్సిటీ విద్యార్థులతో పాటు రైతులకు అనుకూలంగా ఉంటుందన్నారు.