
కార్యక్రమంలో పాల్గొన్న విప్లవ గాయకులు, కవులు
కోలారు: ప్రముఖ విప్లవ గాయకుడు, తెలంగాణ పోరాట యోధుడు స్వర్గీయ ప్రజాకవి గద్దర్కు శ్రద్ధాంజలి కార్యక్రమాన్ని నగరంలోని నచికేత నిలయంలో గురువారం నిర్వహించారు. కర్ణాటక, ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల నుంచి వచ్చిన వందలాది మంది గాయకులు పాల్గొని గద్దర్ జ్ఞాపకార్థం విప్లవ గీతాలను ఆలపించారు. కవులు కావ్యాలు చదివారు. ఈ సందర్భంగా కవి గొల్లహళ్లి శివప్రసాద్ మాట్లాడుతూ గద్దర్ ఆశు కవి అని, సందర్భానుసారంగా పాటలు పాడేవారన్నారు. ఆయన స్ఫూర్తితోనే నేడు వేల సంఖ్యలో గాయకులు పుట్టుకొచ్చారన్నారు. సీనియర్ గాయకులు ఎస్.మునిస్వామి, హైదరాబార్ విమలక్క, కవి గోష్టిలో హులికుంటె మూర్తి, కాగతి వెంకటాచలపతి, వికాస్ ఆర్.మౌర్య, డాక్టర్ నేత్రావతి పాల్గొన్నారు.