కిలాడీ వధువు.. పెళ్లయిన మూడునెలలకు | - | Sakshi
Sakshi News home page

కిలాడీ వధువు.. పెళ్లయిన మూడునెలలకు

Sep 18 2023 1:02 AM | Updated on Sep 19 2023 7:00 PM

- - Sakshi

బనశంకరి: పెళ్లయిన మూడునెలలకు భార్య విలువైన బంగారు ఆభరణాలు, స్కూటర్‌తో ఉడాయించింది ఈ ఘటన బెంగళూరులో చోటుచేసుకుంది. వివరాలు.. సంతోష్‌ కు కరోనా సమయంలో సోషల్‌ మీడియాలో అఖిల అనే యువతి పరిచయమైంది. ఆమె కోరిక మేరకు ఒక ఐటీ సంస్థలో ఉద్యోగం కూడా ఇప్పించాడు.

అప్పటినుంచి ఇద్దరూ ఒకే బైకులో ఆఫీసుకు వెళ్లేవారు, అలా ప్రేమ పుట్టుకొచ్చింది. ఆమె అడగడంతో సంతోష్‌ రూ.1.30 లక్షల విలువచేసే ఐఫోన్‌ను కొనిచ్చాడు. ఈసారి బ్యాంకాక్‌ టూర్‌కి వెళ్దామని రూ. 6 లక్షలు తీసుకుంది. టూర్‌ ముగించుకుని రాగానే మరో ఐఫోన్‌ కొనించుకుంది.

మళ్లీ నగలు, నగదు వసూళ్లు
ఆపై అఖిల బావ అరుణ్‌, అశ్విని రంగంలోకి వచ్చారు. తనకు రూ.15 లక్షలు బంగారు నగలు కొనివ్వాలని, అప్పుడే మీ ఇద్దరికి పెళ్లి చేస్తానని అశ్విని డిమాండ్‌ చేయడంతో నగలు కొనిచ్చాడు. పెళ్లి పేరుతో మళ్లీ నుంచి రూ.5 లక్షలు వసూలు చేశారు. చివరకు చంద్రాలేఔట్‌ మద్దూరమ్మ ఆలయంలో కొందరు బంధువుల సమక్షంలో సంతోష్‌– అఖిలకు పెళ్లి జరిగింది. మూడు నెలలు కాగానే ఇటీవల రూ. 20 లక్షల విలువచేసే బంగారు ఆభరణాలు, రెండు మొబైల్స్‌, ద్విచక్ర వాహనంతో అఖిల మాయమైంది. ఆమె కోసం సంతోష్‌ గాలించినా ఆచూకీ లేదు. మోసపోయినట్లు గ్రహించి భార్య, ఆమె అక్క బావలపై చంద్రాలేఔట్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా విచారణ చేపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement