లారీని ఢీకొన్న ప్రైవేటు బస్సు● | - | Sakshi
Sakshi News home page

లారీని ఢీకొన్న ప్రైవేటు బస్సు●

Sep 18 2023 1:02 AM | Updated on Sep 18 2023 1:02 AM

భూమిపూజ చేస్తున్న ఎమ్మెల్యే వై. ప్రకాష్‌   - Sakshi

భూమిపూజ చేస్తున్న ఎమ్మెల్యే వై. ప్రకాష్‌

ఐదుమందికి గాయాలు

క్రిష్ణగిరి: రోడ్డు పక్కన నిలిపిన లారీని బస్సు ఢీకొన్న ప్రమాదంలో డ్రైవర్‌తో పాటు ఐదు మందికి తీవ్ర గాయాలేర్పడిన ఘటన సూళగిరి వద్ద జరిగింది. వివరాల మేరకు హోసూరు నుంచి క్రిష్ణగిరి వైపు శనివారం సాయంత్రం ప్రయాణికులను తీసుకొని ఓ ప్రైవేట్‌ బస్సు బయల్దేరింది. హోసూరు– క్రిష్ణగిరి హైవేపై సూళగిరి సమీపంలోని సుండగిరి వద్ద రోడ్డు పక్కన నిలిచి ఉన్న లారీని ఈ బస్సు ఢీకొనింది. ఈ ప్రమాదంలో బస్‌ డ్రైవర్‌తో, ఇద్దరు మహిళలు, మరో ఇద్దరు ప్రయాణికులకు తీవ్ర గాయాలు తగిలాయి. వెంటనే స్థానికులు వారిని చికిత్స కోసం క్రిష్ణగిరి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సూళగిరి పోలీసులు కేసు నమోదు చేశారు.

భూమిపూజ

హోసూరు: హోసూరు కార్పొరేషన్‌ పరిధిలోని 15వ వార్డులో రూ. 8 లక్షలతో చేపట్టిన సముదాయ భవన నిర్మాణ పనులకు హోసూరు ఎమ్మెల్యే వై. ప్రకాష్‌, మేయర్‌ ఎస్‌.ఏ. సత్య ఆదివారం భూమిపూజ చేశారు. డిప్యూటీ మేయర్‌ ఆనందయ్య, రవి, నాగరాజ్‌, కణ్ణన్‌, నవీణ్‌కుమార్‌, మోహన్‌బాబు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement