జిల్లాల వారీగా నమోదైన ఉష్ణోగ్రతలు
సాక్షి ప్రతినిధి, కరీంనగర్:
సూరీడు నిప్పులు కక్కుతున్నాడు. ఇప్పటికే ఉమ్మడి జిల్లా రెడ్ జోన్లోకి చేరగా శనివారం ఎన్నడూ లేని విధంగా 46.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. కరీంనగర్ జిల్లాలో రెండు మండలాలు, పెద్దపల్లి జిల్లాలో ఏడు మండలాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవగా వడగాలుల ప్రభావం అధికంగా ఉందని ప్రణాళిక విభాగం అధికారులు ప్రకటించారు. కాగా ఉదయం 8గంటలకే వేడిగాలులు ఉక్కిరిబిక్కిరి చేయగా సాయంత్రం 6దాటినా దారులపై వడగాలులే. మరో నాలుగు రోజుల పాటు వడగాలులుంటాయని వాతావరణ శాఖ ప్రకటించగా ప్రజలంతా జాగ్రత్త ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. వీలైతే పనులను వాయిదా వేసుకోవడమే ఉత్తమమని స్పష్టం చేస్తున్నారు.
కరీంనగర్(గంగాధర) 46.4
పెద్దపల్లి (ఎలిగేడు) 46.4
జగిత్యాల (కోరుట్ల, అయిలాపూర్) 46.4
రాజన్న సిరిసిల్ల (పెద్దూరు) 46.4


