కరీంనగర్టౌన్/సప్తగిరికాలనీ(కరీంనగర్): ఇంటర్ ఫలితాల్లో కరీంనగర్లోని శ్రీచైతన్య కళాశాల విద్యార్థులు జయకేతనం ఎగురవేసినట్లు విద్యాసంస్థల అధినేత ముద్దసాని రమేశ్రెడ్డి తెలిపారు. సెకండియర్ ఎంపీసీలో శశికుమార్, మైత్రి, చారుహాసిని 995 మార్కులు, సాత్విక, శ్రీనిత్య, ప్రవళ్లిక 994, బైపీసీలో లహరి, శ్రీనివాసన్, కార్తీక్ 994 మార్కులు, ఎంఈసీలో పల్లవి రాజయ్య 974, సీఈసీలో అంజలి 984 మార్కులు సాధించినట్లు తెలిపారు. ప్రథమ సంవత్సరం ఎంపీసీలో ప్రశాంత్గౌడ్ 468, అక్షర, అక్షయ, గిఫ్టి, కల్యాణి 467, బైపీసీలో మేఘన, సిద్ధార్థ్ 438, మనోజ్ఞ 437 మార్కులు, ఎంఈసీలో లిఖిత గుప్త 494, సీఈసీలో శివాత్మికరెడ్డి 490 మార్కులు సాధించారని సంతోషం వ్యక్తం చేశారు.


