ప్రస్తుతం ఒంటిపూట బడులు కొనసాగుతున్నాయి. గ్రామాలు, పట్టణాల్లో కొందరు విద్యార్థులు ఈత నేర్చుకునేందుకు మధ్యాహ్నం వేళ చెరువులు, కుంటలు, కాలువల్లోకి వెళ్లి సరదాగా ఈత కొడుతున్నారు. ఈత సరదా ఎవరి ఇంట్లోనూ విషాదం కాకుండా చాలా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు, నిపుణులు సూచిస్తున్నారు. పెద్దపల్లి శివారులోని నిట్టూరు మార్గంలో ఎస్సారెస్పీ ఉపకాలువలో ఈదుతూ, కేరింతలు కొడుతూ సందడి చేస్తున్న చిన్నారులు ‘సాక్షి’ కెమెరాకు ఇలాకనిపించారు.
– సాక్షి ఫొటోగ్రాఫర్,పెద్దపల్లి


