
దుబాయ్ వెళ్లేందుకు మరొకరు సిద్ధం
విదేశాలకు పారిపోతున్న నిందితులు కేసు నమోదు, దర్యాప్తులో జాప్యమే కారణం జీబీఆర్ క్రిప్టోలో దుబాయ్ వెళ్దామనుకున్న సూత్రధారి మెటా క్రిప్టోలో థాయ్లాండ్, విజయవాడకు.. మహిళపై దాడి కేసులో అమెరికాకు నిందితులు జంప్ తీవ్రంగా స్పందించిన సీపీ గౌస్, లుక్ అవుట్ నోటీసులకు ఆదేశం
సాక్షిప్రతినిధి, కరీంనగర్:
జనవరి నుంచి పలు కేసుల్లో..
జీబీఆర్ క్రిప్టో కరెన్సీ పేరిట కరీంనగర్ కేంద్రంగా ఈ ఏడాది జనవరిలో వెలుగుచూసిన రూ.95 కోట్ల స్కాంలో నిందితుడు రమేశ్గౌడ్ దేశం వదిలి పారిపోయేందుకు సిద్ధపడ్డాడు. ఇక్కడ వసూలు చేసిన డబ్బులతో దుబాయ్లో ప్లాటు కొని, పదేళ్ల వీసా సంపాదించాడు. ఇంతలో రమేశ్గౌడ్ కరీంనగర్ సీఐడీ డీఎస్పీ కుమ్మక్కయ్యారని, బాధితులు సీఐడీ చీఫ్కు సాక్ష్యాధారాలతో ఫిర్యాదు చేశారు. అప్పటి కరీంనగర్ సీఐడీ డీఎస్పీని అదే రోజు డీజీపీ కార్యాలయానికి అటాచ్ చేశారు. వెంటనే రమేశ్గౌడ్ను కూడా అదుపులోకి తీసుకున్నారు.
ఏసీబీ నుంచీ లీక్..
ఆగస్టు చివరి వారంలో బల్దియాలో ఓ అవినీతి తిమింగళంలా పేరొందిన అధికారిని వేటాడేందుకు ఏసీబీ వలపన్నింది. అయితే, స్థానికంగా ఉన్న కొందరు అధికారులు ముందే ఈ సమాచారాన్ని సదరు అధికారికి లీక్ చేశారు. దీంతో సదరు అధికారి ఆ రోజు ఏసీబీకి చిక్కకుండా ఊరొదిలి పారిపోయాడు.
అమెరికాకు పరారై ..
వాట్సాప్ స్టేటస్ పెట్టి..
తాజాగా ఈనెల 3న వన్టౌన్ పోలీసుస్టేషన్ పరిధిలో ఓ మహిళపై దాడి కేసులో పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించారు. మహిళపై మరో మహిళ, నలుగురు పురుషులు దాడి చేశారు. ఈ దాడిలో మహిళ దంతాలు రాలిపోయి, చేతివేళ్లు విరిగాయి. కంటికి, ఒంటికి తీవ్ర గాయాలయ్యాయి. దాడి చేసిన వారిలో ఇద్దరు పురుషులు ఎన్నారైలు. వారిద్దరూ దేశం వదిలి పారిపోతారని చెప్పినా.. కనీసం ఎఫ్ఐఆర్లో వారి పేర్లు కూడా ప్రస్తావించలేదు. ఫలితంగా 9న అర్ధరాత్రి నిందితులిద్దరూ అమెరికాకు పారిపోయి, వాట్సాప్లో స్టేటస్ పెట్టడం గమనార్హం. ఈ వ్యవహారంలో భారీగా డబ్బులు చేతులు మారాయని బాధితులు ఆరోపిస్తున్నారు. సీసీ టీవీ ఫుటేజీ, ప్రత్యక్ష సాక్షులను సైతం పరిగణనలోకి తీసుకోకపోవడంపై కాలనీ మొత్తం విస్మయం వ్యక్తం చేస్తోంది. ఈ వ్యవహారంపై సీపీ గౌస్ ఆలం సీరియస్ అయ్యారు. టౌన్ ఏసీపీని పిలిపించి వివరణ కోరారు. అమెరికా పారిపోయిన వారిపై లుక్ అవుట్ నోటీసులు జారీ చేయాలని ఆదేశించినట్లు సమాచారం.
థాయ్లాండ్ ట్రాఫికింగ్ విషయంలో..
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో సంచలనం సృష్టించిన థాయ్లాండ్ కేంద్రంగా వెలుగుచూసిన సైబర్ కేఫ్ ట్రాఫికింగ్ కేసులో పోలీసులు సరైన కాలంలో లుక్అవుట్ నోటీసు సర్క్యులర్ జారీ చేయలేకపోయారు. దీంతో నిందితుడిని ఢిల్లీలోని ఏపీ హౌజ్లో గుజరాత్ పోలీసులు అరెస్టు చేసేందుకు సిద్ధపడ్డారు. ఆ సమయంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ జోక్యంతో నిందితుడిని కరీంనగర్కు తీసుకువచ్చారు.
మెటా ఫండ్ పేరిట కరీంనగర్ కేంద్రంగా మరో క్రిప్టో స్కాం వెలుగుచూసింది. రోజూ లాభాలు వస్తాయని ఆశపెట్టడంతో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో దాదాపు రూ.100 కోట్ల వరకు వసూలు చేశారని ప్రచారం జరగుతోంది. ఈ కేసులో టూటౌన్, రూరల్, కొత్తపల్లిలో బాధితులు ఫిర్యాదు చేసినా.. పోలీసులు తాత్సారం చేశారు. పైగా నిందితులతో సెటిల్ చేసుకోవాలని బాధితులకు ఉచిత సలహా ఇచ్చి పంపారు. ఎట్టకేలకు జూలైలో దాసరి రమేశ్, దాసరి రాజుపై కేసు నమోదైంది. పోలీసుల నిర్లక్ష్యం అదునుగా చేసుకుని నిందితులు విజయవాడకు పరారై ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు. ఇదే కేసులో ప్రధాన నిందితుల్లో ఒకరైన లోకేశ్ థాయ్లాండ్ పారిపోయాడని ప్రచారం జరుగుతోంది. ఇంకో నిందితుడు సతీశ్ దుబాయ్లో ఇప్పటికే పలు పెట్టుబడులు పెట్టి దేశం వదిలిపారిపోయేందుకు సిద్ధంగా ఉండటం కొసమెరుపు.

దుబాయ్ వెళ్లేందుకు మరొకరు సిద్ధం

దుబాయ్ వెళ్లేందుకు మరొకరు సిద్ధం