గ్రామానికి కీడు సోకిందని.. | - | Sakshi
Sakshi News home page

గ్రామానికి కీడు సోకిందని..

Aug 7 2025 7:32 AM | Updated on Aug 7 2025 7:32 AM

గ్రామానికి కీడు సోకిందని..

గ్రామానికి కీడు సోకిందని..

ఇల్లందకుంట:జిల్లాలోని ఇల్లందకుంట మండలం మర్రివానిపల్లి గ్రామానికి కీడుసోకిందని గ్రామస్తులంతా బుధవారం కీడు నివారణ వంటలకు వెళ్లారు. గ్రామంలో ఐదునెలలుగా వివిధ కారణాలతో చనిపోతున్నారని గ్రామస్తులు తెలిపారు. ఒకరు మృతిచెంది పక్షం రోజులు కాకముందే మరొకరు చనిపోతున్నారని అన్నారు. ఈ విషయమై ఓ పండితుడిని కలిశారు. గ్రామంలో వరుస మరణాలకు కీడే కారణమని అతను చెప్పాడు. గ్రామస్తులు కీడు భోజనాలకు వెళ్లాలని సూచించాడు. దీంతో ముందురోజే గ్రామంలో పెద్దలు దండోరా వేయించారు. బుధవారం ఉదయం 6 గంటలకే ఇళ్లకు తాళాలు వేసి, ఊరు విడిచి వెళ్లారు. పొలాల వద్ద వంట చేసుకుని, భోజనాలు చేశారు. తిరిగి 5గంటలకు ఇల్లు చేరారు. గురువారం బొడ్రాయి, భూలక్ష్మికి పూజలు చేస్తామని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement