
స్వగ్రామానికి మృతదేహం
మల్యాల(చొప్పదండి): మండలంలోని ముత్యంపేట గ్రామానికి చెందిన పంజాల వాసుగౌడ్ (40) మృతదేహం ఆదివారం స్వగ్రామానికి చేరింది. ఉపాధి కోసం దుబాయ్ వెళ్లిన వాసుగౌడ్ గత ఫిబ్రవరిలో అక్కడ ఆత్మహత్య చేసుకోగా, పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని మార్చురీలో భద్రపరిచారు. రెండు నెలలు గడిచినా మృతుడి ఆచూకీ కోసం ఎవరూ రాకపోవడంతో పోలీసులు మృతుడి వేలిముద్రల ఆధారంగా తెలుసుకొని ఇండియన్ ఎంబసీకి సమాచారం అందజేశారు. ఈక్రమంలో వాసుగౌడ్ వివరాలను గల్ఫ్ కార్మికుల సంరక్షణ సమితి అధ్యక్షుడు గుండెల్లి నరసింహ, ఉపాధ్యక్షుడు శేఖర్గౌడ్ సేకరించి మృతదేహాన్ని స్వగ్రామానికి పంపించారు. మృతుడికి భార్య, ఇద్దరు కూతుళ్లు, కుమారుడు ఉన్నారు.