ఆర్థిక ఇబ్బందులతో యువకుడి ఆత్మహత్య | - | Sakshi
Sakshi News home page

ఆర్థిక ఇబ్బందులతో యువకుడి ఆత్మహత్య

Jun 2 2025 12:20 AM | Updated on Jun 2 2025 12:20 AM

ఆర్థిక ఇబ్బందులతో యువకుడి ఆత్మహత్య

ఆర్థిక ఇబ్బందులతో యువకుడి ఆత్మహత్య

మల్లాపూర్‌(కోరుట్ల): మండలకేంద్రంలోని ఒడ్డెరకాలనీకి చెందిన దండుగుల శ్రీనివాస్‌(22) ఆదివారం వేకువజామున ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాలు.. దండుగుల పోశేట్టి–బక్కవ్వ దంపతులకు శ్రీనివాస్‌ సంతానం. ఇతడి చిన్నతనంలోనే పోశేట్టితో బక్కవ్వ విడాకులు తీసుకుంది. శ్రీనివాస్‌ను పెంచి పెద్దచేసింది. కొంతకాలంగా బక్కవ్వ మానసికస్థితి సరిగా ఉండపోవడంతో పాటు ఇటీవల శ్రీనివాస్‌ హైదరాబాద్‌కి వెళ్లి అప్పు చేసి టిఫిన్‌ సెంటర్‌ ఏర్పాటు చేశాడు. ఆర్థిక ఇబ్బందులతో తీవ్రంగా సతమతమవుతున్నాడు. రెండురోజుల క్రితం మల్లాపూర్‌కు వచ్చిన శ్రీనివాస్‌ జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి చిన్నతాత శివరాత్రి నర్సయ్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్‌చార్జి ఎస్సై రాజునాయక్‌ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement