● కళ తప్పిన కాలనీలు.. శిథిలావస్థలో క్వార్టర్లు
● అస్తిత్వం కోల్పోయిన రామగుండం బీ థర్మల్
● మూతపడి ఏడాది.. అనుబంధం విస్మరించని ప్రజలు
రామగుండం: పట్టణంలోని బి–థర్మల్ విద్యుత్ కేంద్రం మూతపడి ఏడాది పూర్తయింది. దానితో అనుబంధం కలిగి ఉన్న ప్రజలు ఆ భావోద్వేగాల నుంచి బయటపడడం లేదు. విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో పనిచేసే సుమారు 300 మంది ఉద్యోగుల్లో ఇప్పటికే 70 మందిని యాదాద్రికి బదిలీ అయ్యారు. మరో రెండురోజుల్లో ఇంకో 50 మంది బదిలీ అయ్యే అవకాశం ఉంది. మిగతా ఉద్యోగులు.. ప్లాంట్ కూల్చివేత వరకూ ఇక్కడే ఉంటారని సమాచారం.
50ఏళ్ల క్రితమే..
సుమారు 50 ఏళ్ల క్రితమే ఏ–పవర్ ప్లాంట్ ప్రారంభించి.. అనతికాలంలోనే మూతపడగా అప్పటికే కొంత జనాభా తగ్గిపోయింది. ఇప్పుడు బీ–థర్మల్ విద్యుత్ కేంద్రం మూసివేతతో రామగుండం అస్తి త్వం పూర్తిగా కోల్పోయినట్లయ్యింది. దీనిప్రభావం ప్రత్యక్షంగా బ్యాంకు, కార్మికులు, కాంట్రాక్టర్లపై ప డగా, పరోక్షంగా స్కూళ్లు, చిరు వ్యాపారులపై పడి ంది. ఉద్యోగులు తమ క్వార్టర్లను ఖాళీ చేసి వెళ్లిపోతుండడంతో అప్పటికే శిథిలావస్థకు చేరిన క్వార్టర్లు, అపరిశుభ్రంగా, చిత్తడిగా తయారయ్యాయి.
● విద్యుత్ ప్లాంట్లో ఇరవై ఏళ్లపాటు షట్డౌన్ తదితర ఓవర్హాలింగ్ పనులు చేసేవాడిని. సాంకేతిక పరిజ్ఞానం, సమస్యల సాధన పరిష్కారంపై పట్టు పెరగడంతో నామినేషన్ పద్ధతిపై చిన్నకాంట్రాక్టు పనులు తీసుకున్నా. ఇలా వచ్చే ఆదాయంతో కుటుంబాన్ని పోషించేవాడిని. ఇప్పుడు ప్లాంట్ మూతపడడంతో భరోసా కోల్పోయినట్లయ్యిందని సిరికొండ కోటి ఆవేదన చెందాడు.
● నేను ఇక్కడే పుట్టి ఇక్కడే ఉద్యోగం చేసి ఇక్కడే పదవీ విరమణ చేశా. ఐదు దశాబ్దాలపాటు పనిచేసే వారు, రిటైర్డ్ అయినవారితో బంధుత్వం ఏర్పడింది. ఆలయాలు, ఇళ్లలో జరిగే వేడుకలు, పర్వదినాల సందర్భంగా అందరం కలుసుకోవడం బాగుండేది. యాద్రాద్రికి బదిలీ అయినవారు కొందరు, ఉపాధి కోల్పోయి మరోచోటకు వెళ్లేవారు మరికొందరు.. బరువైన గుండెలతో వెళ్తుండడం చాలాబాధగా ఉందని రిటైర్డ్ ఉద్యోగి ఇరికిళ్ల రాజనర్సయ్య ఆవేదన చెందాడు.
నాడు వైభవం.. నేడు కళావిహీనం
నాడు వైభవం.. నేడు కళావిహీనం
నాడు వైభవం.. నేడు కళావిహీనం
నాడు వైభవం.. నేడు కళావిహీనం