పిల్లలను ప్రభుత్వ బడుల్లో చేర్పించండి: డీఈవో | - | Sakshi
Sakshi News home page

పిల్లలను ప్రభుత్వ బడుల్లో చేర్పించండి: డీఈవో

Jun 8 2025 12:40 AM | Updated on Jun 8 2025 12:40 AM

పిల్ల

పిల్లలను ప్రభుత్వ బడుల్లో చేర్పించండి: డీఈవో

చొప్పదండి: ప్రభుత్వ పాఠశాలలను బలోపే తం చేసేందుకు పిల్లలను చేర్పించాలని డీఈ వో శ్రీరామ్‌ మొండయ్య తల్లిదండ్రులను కోరా రు. చొప్పదండి మండలం కాట్నపల్లి గ్రామంలో ప్రొఫెసర్‌ జయశంకర్‌ బడిబాట ఇంటింటా ప్రచార కార్యక్రమం నిర్వహించారు. ఎస్‌జీటీ యూ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రచారరథాన్ని డీఈవో మొండయ్య, ఎంఈవో పి.మోహన్‌, కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు ఇప్ప శ్రీని వాస్‌రెడ్డి, ఎస్‌జీటీయూ జిల్లా అధ్యక్షుడు వూ కంటి విజేందర్‌రెడ్డి జెండా ఊపి ప్రారంభించా రు. ఈ సందర్భంగా డీఈవో మాట్లాడుతూ పాఠశాలల్లో ప్రభుత్వం అన్ని రకాల వసతులు కల్పించిందని తెలిపారు. తల్లిదండ్రులు పిల్ల లను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని కోరా రు. సాంబయ్యపల్లి, గుమ్లాపూర్‌, చొప్పదండి, భూపాలపట్నం, వెదురుగట్ట గ్రామాల్లో ప్రచా రం నిర్వహించారు. జిల్లా సెక్టోరియల్‌ ఆఫీసర్‌ అశోక్‌రెడ్డి, రుక్మాపూర్‌ స్కూల్‌ కాంప్లెక్స్‌ ప్రధానోపాధ్యాయులు శ్రీధర్‌, కట్టెకోల తారలక్ష్మణ్‌, శ్రీనివాస్‌, రాములు, శాంతికిరణ్‌ పాల్గొన్నారు.

ఆపరేషన్‌ కగార్‌ నిలిపివేయాలి

కరీంనగర్‌: కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఆపరేషన్‌ కగార్‌ను వెంటనే నిలిపివేయాలని, దేశంలో జరుగుతున్న బూటకపు ఎన్‌కౌంటర్‌లను ఖండించాలని, మావోయిస్టులతో శాంతిచర్చలు జరపాలని డిమాండ్‌ చేస్తూ సీపీఐ, సీపీఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో శనివారం కరీంనగర్‌లోని తెలంగాణచౌక్‌లో నల్లజెండాలు పట్టుకొని నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవరెడ్డి, సీపీఐ నగర కార్యదర్శి కసిరెడ్డి సురేందర్‌రెడ్డి మాట్లాడుతూ దేశంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మావోయిస్టులను హతమార్చడమే లక్ష్యంగా ముందుకు సా గుతోందన్నారు. కేంద్ర ప్రభుత్వ తీరును మేధావులు, ప్రజలు, ప్రజాసంఘాలు ముందుకు వచ్చి వ్యతిరేకించాలని కోరారు. మావోయిస్టులతో చర్చలు జరపాలని, లేకుంటే వామపక్షా ల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. కా ర్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు గుడికందుల సత్యం, గిట్ల ముకుందరెడ్డి, సీపీఐ, సీ పీఎం జిల్లా కార్యవర్గ, కౌన్సిల్‌ సభ్యులు మల్లయ్య, రాజు, బుచ్చన్నయాదవ్‌, రమేశ్‌, నాగమణి, రమేశ్‌, యుగంధర్‌, అంజలి పాల్గొన్నారు.

లీకేజీకి అడ్డుకట్ట

కరీంనగర్‌ కార్పొరేషన్‌: నగరంలోని కట్టరాంపూర్‌ నాగన్న చౌరస్తా వద్ద నెలకొన్న లీకేజీకి అధికారులు అడ్డుకట్ట వేశారు. పైప్‌లు, జాయింట్లలో లీకేజీతో ఇరవై రోజులకు పైగా భారీగా రోడ్డుపై వరద పారుతుండడం తెలిసిందే. దీనిపై ‘సిటీలో లీకేజీ వరద’ పేరిట ఈ నెల 4వ తేదీన ‘సాక్షి’లో వచ్చిన కథనానికి నగరపాలకసంస్థ అధికారులు స్పందించారు. 32, 12, తదితర డివిజన్లకు నీళ్లు అందించే ప్రధాన పైప్‌లైన్‌ కావడంతో, లీకేజీతో భారీగా నీళ్లు వృధాగా పోయాయి. ఫలితంగా నిత్యం కట్టరాంపూర్‌ నుంచి డ్యాం వైపు వెళ్లే మెయిన్‌ రోడ్డు వరదమయంగా మారింది. శనివారం పైప్‌లైన్‌ ను సరిచేసి, వరదతో దెబ్బతిన్న టైల్స్‌పై మట్టి వేసి చదును చేశారు. సమస్య మళ్లీ తిరగబెట్టకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలని ఆ ప్రాంత వాసులు కోరుతున్నారు.

పవర్‌కట్‌ ప్రాంతాలు

కొత్తపల్లి: కొత్త డీటీఆర్‌ ఏర్పాటు పనులు చేపడుతున్నందున ఆదివారం ఉదయం 8 నుంచి 10 గంటల వరకు 11 కేవీసీసీ ఫీడర్‌ పరిధిలోని ముకరంపుర, బస్టాండ్‌, వన్‌టౌన్‌ పోలీస్‌స్టేషన్‌, కలెక్టర్‌ ఆఫీసు కార్యాలయాల ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరా నిలిపివేస్తున్నట్లు టౌన్‌–2 ఏడీఈ ఎం.లావణ్య తెలిపారు. ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు 11కేవీ ఎల్ల మ్మ ఫీడర్‌లో ఆటోనగర్‌, బీఎస్‌ఎన్‌ఎల్‌ టవర్‌ ఏరియా, మల్లికార్జునకాలనీ ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరా నిలిపివేస్తున్నట్లు టౌన్‌–1 ఏడీఈ పి.శ్రీనివాస్‌ తెలిపారు.

పిల్లలను ప్రభుత్వ బడుల్లో చేర్పించండి: డీఈవో1
1/3

పిల్లలను ప్రభుత్వ బడుల్లో చేర్పించండి: డీఈవో

పిల్లలను ప్రభుత్వ బడుల్లో చేర్పించండి: డీఈవో2
2/3

పిల్లలను ప్రభుత్వ బడుల్లో చేర్పించండి: డీఈవో

పిల్లలను ప్రభుత్వ బడుల్లో చేర్పించండి: డీఈవో3
3/3

పిల్లలను ప్రభుత్వ బడుల్లో చేర్పించండి: డీఈవో

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement