
ముందస్తు బడిబాట
ఇల్లంతకుంట(మానకొండూర్): ఇల్లంతకుంట మండల ఎస్జీటీ ఉపాధ్యాయ సంఘం సభ్యులు మే చివరి వారంలో పలు గ్రామాల్లో బడిబాట కార్యక్రమం చేపట్టారు. కందికట్కూర్, ఓబులాపూర్, ఇల్లంతకుంట, సిరికొండ, జంగారెడ్డి పల్లె, బోటిమీదిపల్లె తదితర గ్రామాల్లో మండల విద్యాధికారి శ్రీనివాస్, ఎస్జీటీ యూనియన్ అధ్యక్షుడు మహిపాల్రెడ్డి, మండల అధ్యక్షుడు శ్రీనివాస్, తదితరులు ఊరూరా తిరుగుతూ.. విద్యార్థులు సర్కార్ బడుల్లోనే చేర్పించాలని, ప్రభుత్వం అందిస్తున్న సదుపాయాలను తల్లిదండ్రులకు వివరించారు. బడీడు పిల్లలను నమోదు చేయించాలని అంగన్వాడీ టీచర్లను కోరారు.
ఇంటింటా తిరిగా..
గ్రామాల్లోని విద్యార్థులు ప్రైవేటు స్కూళ్లకు వెళ్లకుండా ప్రభుత్వ బడుల్లో చేరేలా ఏప్రిల్ చివరలో సిరికొండ గ్రామంలో ఇంటింటా తిరిగా. ప్రైవేటు విద్యార్థుల వివరాలు సేకరించి వారి తల్లిదండ్రులతో పాఠశాలలో సమావేశం నిర్వహించా. ఎంఈఓ శ్రీనివాస్, స్కూల్ కాంప్లెక్స్ హెచ్ఎం తిరుపతి హాజరయ్యారు. పిల్లలకు నాణ్యమైన, గుణాత్మకమైన విద్యనందిస్తామని తల్లిదండ్రులకు అవగాహన కల్పించగా, ప్రభుత్వ బడికి పంపిస్తామని ప్రతిజ్ఞ చేశారు.
– తంగళ్లపల్లి శ్రీనివాస్, ఎస్జీటీ యూనియన్ మండల అధ్యక్షుడు

ముందస్తు బడిబాట