
చాయ్తో.. ఆర్సీబీ విజయోత్సవ వేడుక
● రోజంతా అమృతతుల్యా ఉచితంగా చాయ్ అందజేత
మల్యాల: ఐపీఎల్లో ఆర్సీబీ జట్టు విజయం సాధించడంపై సంతోషం వ్యక్తం చేస్తూ, విరాట్ కోహ్లీ వీరాభిమాని ఉచితంగా చాయ్ పంపిణీ చేసి సంబురాలు చేసుకున్నాడు. జగిత్యాల జిల్లా మల్యాల మండలం ఒబులాపూర్ గ్రామానికి చెందిన జంగం రఘు మల్యాల అడ్డరోడ్డుపై అమృతతుల్య చాయ్ సెంటర్ నిర్వహిస్తున్నాడు. ఐపీఎల్లో ఆర్సీబీ విజయం సాధించడంపై హర్షం వ్యక్తం చేస్తూ బుధవారం ఉదయం నుంచి రాత్రి వరకు సుమారు 400 చాయ్లు ఉచితంగా అందజేసి, సంబురాలు చేసుకున్నాడు. రాష్ట్ర ప్రణాళిక బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు వినోద్కుమార్, చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, వారి వెంట ఉన్న బీఆర్ఎస్ నాయకులకు ఉచితచాయ్ని ఆస్వాదించారు.
నిర్వాసితులతో సమావేశం నిర్వహించాలి
వేములవాడ: వేములవాడ మూలవాగు బ్రిడ్రి నుంచి రాజన్న ఆలయం వరకు చేపట్టే రోడ్ల విస్తరణలో 243 మంది నిర్వాసితులతో అధికారులు సమావేశం నిర్వహించిన తర్వాతనే పనులు చేపట్టాలనని అమర్ కోరారు. వేములవాడలో బుధవారం నిర్వహించిన సమావేశంలో పాల్గొన్న అమర్ మాట్లాడారు. హైకోర్టు స్టే ఉన్నా అధికారులు, వ్యాపారులను భయాందోళనకు గురిచేస్తున్నారన్నారు. భూసేకరణలో భాగంగా వాల్యువేషన్ సక్రమంగా చేయడం లేదన్నారు. గతంలోనే రెండు బైపాస్రోడ్డులకు స్థానిక వ్యాపారులు తమ భూములను ఇచ్చారన్నారు. ఇలాంటి తరుణంలో మరోసారి రోడ్డు విస్తరణ అవసరం లేదని సమావేశంలో తీర్మానించారు. ప్రభుత్వవిప్ ఆది శ్రీనివాస్ నిర్వాసితులతో సమావేశం నిర్వహించాలని కోరారు.
ట్రైనీ ఎస్సై, కానిస్టేబుళ్లపై చర్యలు
కరీంనగర్క్రైం: సైదాపూర్ శివారులో గత నెల 8న వాహన తనిఖీ నిర్వహిస్తుండగా జరిగిన ఘటనపై ట్రైనీ ఎస్సై, కానిస్టేబుళ్లపై చర్యలు తీసుకున్నట్లు క రీంనగర్ సీపీ గౌస్ ఆలం ప్రకటించారు. వివరాల్లోకి వెళ్తే.. గత నెల 8న సైదాపూర్ పోలీస్ స్టేషన్ ప్రొబెషనరీ ఎస్సై అగస్త్య భార్గవ్, కానిస్టేబుళ్లు ఆకాశ్, అ జయ్ రోజువారీ విధుల్లో భాగంగా సైదాపూర్ శివా రులో వాహనాల తనిఖీ నిర్వహిస్తున్నారు. అదే స మయంలో హుస్నాబాద్కు చెందిన బత్తుల మహేందర్ అనే వాహనదారుడిని ఆపి తనిఖీ చేయగా.. మ హేందర్, పోలీసులకు గొడవ జరిగి ఈ ఘటనపై కే సు నమోదు చేశారు. ఈ విషయంపై వాహనదా రుడు మహేందర్ సీపీకి ఫిర్యాదు చేశాడు. విచారణ జరిపిన ఉన్నతాధికారుల నివేదిక ఆధారంగా ఆరో జు విధుల్లో ఉన్న కానిస్టేబుళ్లు ఆకాశ్, అజయ్పై క్రమశిక్షణా చర్యల్లో భాగంగా వారికి చార్జ్ మెమో జారీ చేసి పోలీస్ స్టేషన్ విధుల నుంచి తప్పిస్తూ హెడ్ క్వార్టర్స్కు అటాచ్ చేశారు. ట్రైనీ ఎస్సై అగస్త్య భార్గవ్పై క్రమశిక్షణా చర్యల నిమిత్తం మల్టీ జోన్ ఐజీకి నివేదిక పంపించినట్లు సీపీ తెలిపారు.

చాయ్తో.. ఆర్సీబీ విజయోత్సవ వేడుక