
ఇసుక ట్రాక్టర్ ఢీకొని యువకుడు..
మెట్పల్లి: పట్టణంలోని వెల్లుల్ల రోడ్డులో గురువారం రాత్రి ఇసుక ట్రాక్టర్ ఢీకొని బండలింగాపూర్కు చెందిన గుగ్గిళ్ల రవి మృతి చెందాడు. రవి ఇటీవలే ఇంటర్ పూర్తి చేశాడు. పని నిమిత్తం ద్విచక్ర వాహనంపై మెట్పల్లికి వచ్చి తిరిగి బండలింగాపూర్కు వెళ్తున్నాడు. మార్గమధ్యంలో పట్టణ శివారుకు చేరుకోగానే, ఎదురుగా వచ్చిన ఇసుక ట్రాక్టర్ ఢీ కొట్టింది. తలకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మరణించాడు. మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకొని రోదించారు.