
అంగన్వాడీబాటకు సిద్ధం కావాలి
కరీంనగర్: ఈనెల 12 నుంచి 17 వరకు నిర్వహించనున్న అమ్మమాట అంగన్వాడీ బాట కార్యక్రమం ద్వారా ఆరేళ్లలోపు పిల్లలను అంగన్వాడీలో చేర్పించేందుకు మహిళా శిశు సంక్షేమశాఖ అధికారులు సిద్ధం కావాలని జిల్లా సంక్షేమ అధికారి ఎం.సరస్వతి సూచించారు. జిల్లా సంక్షేమ అధికారి కార్యాలయంలో శుక్రవారం సీడీపీవోలు, సూపర్వైజర్లు, పోషణ అభియాన్ సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ నెల 4,5 తేదీల్లో రాష్ట్రస్థాయిలో జరిగిన మేధో మథన సదస్సులో మహిళాభివృద్ధి శిశుసంక్షేమశాఖ సేవలను మరింత విస్తృతం చేసేందుకు మంత్రి సీతక్క ఆదేశాలు జారీ చేశారని తెలిపారు. ఈ విద్యా సంవత్సరంలో మహిళలు, పిల్లల కోసం సాక్ష్యం అంగన్వాడీ, మిషన్శక్తి, మిషన్ వాత్సల్య లక్ష్యాలు వివరించారని అన్నారు. సీడీపీవోలు సబిత, నర్సింగారాణి, శ్రీమతి, సుగుణ, పాల్గొన్నారు.
స్కూళ్లలో వసతులకు నిధులు
కరీంనగర్ కార్పొరేషన్: ప్రభుత్వ పాఠశాలల బ లోపేతానికి సుడా ఆధ్వర్యంలో బడిబాట కార్యక్రమాన్ని చేపడుతున్న ట్లు సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్రెడ్డి తెలి పారు. ప్రభుత్వ పాఠశాలల్లో అవసరమైన వసతుల కల్పనకు నిధులు కేటాయించనున్నట్లు వెల్లడించారు. శుక్రవారం సుడా కార్యాలయంలో మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల పటిష్టతకు రాష్ట్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతోందన్నారు. తమవంతు బాధ్యతగా సుడా ఆధ్వర్యంలో ఈ నెల 8వ తేదీ 11 రోజు ల పాటు బడిబాట కార్యక్రమాన్ని చేపడుతామన్నారు. ప్రత్యేకంగా రూపొందించిన ప్రచారరథం, కరపత్రాలు, పోస్టర్ల ద్వారా ప్రచారం చేస్తామన్నారు. పాఠశాలల్లో మరుగుదొడ్లు, టేబుళ్లు, బెంచీలు, వసతుల కల్పనకు సుడా నిధులు వెచ్చిస్తామన్నారు. ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ప్రతీ ఒక్కరు కలిసి రావాలని ఆయన పిలుపునిచ్చారు.
అధిక సంఖ్యలో విద్యార్థులను చేర్పించాలి
కరీంనగర్: ప్రభుత్వ పాఠశాలల్లో అధికసంఖ్యలో విద్యార్థులను చేర్పించాలని డీఈవో శ్రీరాం మొండయ్య సూచించారు. బడిబాట కార్యక్రమాన్ని జిల్లాల్లోని అన్ని పాఠశాలల్లో ప్రారంభించామని వెల్లడించారు. ఉపాధ్యాయులు గ్రామాల్లోని స్వచ్ఛంద సంస్థలు, మాజీ ప్రజాప్రతినిధుల సహకారంతో విద్యార్థులు వచ్చేవిధంగా అవగాహన కల్పించాలన్నారు. మానకొండూరు మండలం అన్నారం గ్రామంలో బడిబాట కార్యక్రమంలో భాగంగా పాఠశాల విద్యార్థులు, బడీడు పిల్లల తల్లిదండ్రులతో ర్యాలీ నిర్వహించారు. జిల్లాలోని 16 మండలాల్లో కార్యక్రమం మొదటి రోజు విజయవంతమైందని వెల్లడించారు.
క్వింటాల్ పత్తి రూ.7,400
జమ్మికుంట: జమ్మికుంట వ్యవసాయ పత్తి మా ర్కెట్లో క్వింటాల్ పత్తి గరిష్టంగా రూ.7,400 పలికింది. శుక్రవారం మార్కెట్కు నాలుగు వాహనాల్లో 30 క్వింటాళ్ల పత్తిని రైతులు అమ్మకానికి తెచ్చారు. మోడల్ ధర రూ.7,150, కని ష్ట ధర రూ.6,500కు ప్రైవేటు వ్యాపారులు కొ నుగోలు చేశారు. శనివారం బక్రీద్, ఆదివారం సాధారణ సెలవులు ఉంటాయని, సోమవారం యథావిధిగా క్రయ విక్రయాలు కొనసాగుతాయని ఉన్నత శ్రేణి కార్యదర్శి మల్లేశం, గ్రేడ్–2 కార్యదర్శి రాజా తెలిపారు.
‘పది’లో 14మంది గైర్హాజరు
కరీంనగర్: పదోతరగతి అడ్వాన్స్ సప్లిమెంటరీ గణితం పరీక్షకు శుక్రవారం 132 మందికి 118మంది విద్యార్థులు హాజరు అయ్యారు. 14మంది గైర్హాజరయ్యారని డీఈవో శ్రీరాం మొండయ్య తెలిపారు. ప్రత్యేక తనిఖీ బృందం రెండు పరీక్ష కేంద్రాలను, ప్రభుత్వ పరీక్షల విభాగం సహాయ కమిషనర్ ఒక పరీక్ష కేంద్రాన్ని తనిఖీ చేశారని పేర్కొన్నారు.

అంగన్వాడీబాటకు సిద్ధం కావాలి

అంగన్వాడీబాటకు సిద్ధం కావాలి

అంగన్వాడీబాటకు సిద్ధం కావాలి