అర్హులకే రేషన్‌ కార్డులు | - | Sakshi
Sakshi News home page

అర్హులకే రేషన్‌ కార్డులు

Jun 7 2025 12:07 AM | Updated on Jun 7 2025 12:07 AM

అర్హులకే రేషన్‌ కార్డులు

అర్హులకే రేషన్‌ కార్డులు

● కొత్త కార్డుల జారీకి కసరత్తు ● అనర్హుల కార్డుల రద్దుకు కొనసాగుతున్న ప్రక్రియ ● రెవెన్యూ, పౌరసరఫరాల అధికారుల డబుల్‌ రోల్‌

కరీంనగర్‌ అర్బన్‌: రేషన్‌కార్డులపై డబుల్‌ రోల్‌ సాగుతోంది. అనర్హుల కార్డుల ఏరివేత ప్రక్రియ సాగుతుండగా కొత్త రేషన్‌ కార్డుల జారీ ప్రక్రియ నడుస్తోంది. ఏకకాలంలో రెండు ప్రక్రియలు సాగుతుండగా రెవెన్యూ, పౌరసరఫరాలశాఖ సదరు పనిలో నిమగ్నమైంది. గతంలో పలువురు అధికారులు ఇబ్బడిముబ్బడిగా కార్డులు జారీ చేయగా మామూళ్లు పైచేయిగా మారాయి. దీంతో కార్డుల సంఖ్య కుటుంబాలకు మించి ఉండటం అప్పట్లో తీవ్రచర్చకు దారి తీసింది. క్రమేణా అనర్హుల ఏరివేత సాగుతుండగా ఈ సారి పక్కాగా వ్యవహరిస్తున్నారు. అదేస్థాయిలో కొత్తగా దరఖాస్తు చేసుకున్నవారి వివరాలను పరిశీలిస్తూ కార్డులను జారీ చేస్తున్నారు. గడిచిన ఆరునెలలుగా బియ్యం తీసుకోని కార్డుదారుల వివరాలను గుర్తించిన ప్రభుత్వం జాబితాను జిల్లాకు చేరవేసింది. ఇంతకీ ఆ కార్డుదారులు ఉన్నారా? లేదా? అన్నది తేల్చేందుకు క్షేత్రస్థాయిలో విచారణకు ఆదేశించింది. సంబంధీకుల వివరాలతో అనర్హులను తొలగించే ప్రక్రియ మొదలైంది.

సాంకేతికతతో గుర్తింపు

పౌరసరఫరాలశాఖ అధికారులు చౌక దుకాణాల కు సరుకులు కేటాయిస్తుంటారు. ఈ–పోస్‌ యంత్రంపై వేలిముద్ర వేయడం, లేదంటే ఐరిస్‌ విధానం ద్వారా పంపిణీ చేస్తున్నారు. ఈ క్రమంలో సాంకేతికతను వినియోగించి కొందరు అనర్హులుగా ఉన్నట్లుగా గుర్తించింది. అందుబాటులో కి వచ్చిన సాంకేతికతతో ఒకే ఽఆధార్‌ నంబర్‌ కలి గిన లబ్ధిదారులు రెండుచోట్ల సరకులు తీసుకుంటున్నట్లుగా తేల్చారు. ఆరు నెలలుగా వేలమంది కార్డుదారులు బియ్యం తీసుకోనివారు ఉన్నట్లు వివరాలను సేకరించింది. ఇందులో వందేళ్లుదా టిన వారు, 18 ఏళ్లలోపు ఉన్నవారితో పాటు చని పోయినవారు ఉన్నారు. ప్రధానంగా మన రాష్ట్రంలో, పొరుగు రాష్ట్రాల్లోనూ కార్డులు కలిగి ఉన్న ట్లు అనుమానిస్తున్నారు. జిల్లాలో ప్రస్తుతం 2,90,402 రేషన్‌కార్డులు ఉండగా.. సన్నబియ్యం పంపిణీ మొదలైనా.. ఏప్రిల్‌, మే నెలలో సుమా రు 13వేల మంది కార్డుదారులు దుకాణాలకు రావడం లేదంటే వారు అర్హులా? కాదా? అన్న అనుమానాలు వస్తున్నాయి. జనవరిలో 14,343 మంది, ఫిబ్రవరిలో 16,050, మార్చిలో 17,218 మంది కార్డుదారులు దూరంగా ఉన్నారని లెక్క తేలింది. ఏప్రిల్‌లో సన్నబియ్యం అందించడం షురూ కాగా, మార్చితో పోలిస్తే 2వేల మంది అదనంగా బియ్యం తీసుకున్నారు.

10వేలకు పైగా కార్డుల జారీ

కొత్త రేషన్‌ కార్డుల కోసం నిరీక్షిస్తున్నవారు జిల్లాలో 30వేల మందికి పైగా ఉన్నారని తెలుస్తోంది. దరఖాస్తు వచ్చిన తదుపరి గిర్దావర్‌ క్షేత్రస్థాయిలో పరిశీలించి నివేదించడం, నాయబ్‌ తహసీల్దార్‌, తహసీల్దార్‌ పౌరసరఫరాలశాఖకు జాబితాను పంపడం డీఎస్వో అప్రూవ్‌ చేయడం కార్డు రావడం జరిగే ప్రక్రియ. సదరు విధానం త్వరత్వరగా జరిగేలా కలెక్టర్‌ పమేలా సత్పతి చర్యలు చేపట్టారు. కొత్త కార్డులు 10వేలకు పైగా జారీ కాగా 15వేలకు పైగా కార్డుల్లో పేర్లను చేర్చడం వంటి ప్రక్రియ చేపట్టారు. కార్డుల తొలగింపు, కొత్త కార్డుల జారీ ప్రక్రియ కొనసాగుతుందని రెవెన్యూ, పౌరసరఫరాలశాఖ అధికారులు వివరించారు.

జిల్లాలో గ్రామాలు: 318

మునిసిపాలిటీలు: 4

రేషన్‌ దుకాణాలు: 566

రేషన్‌ కార్డులు: 2,90,402

ప్రతినెలా బియ్యం పంపిణీ:

5582 మెట్రిక్‌ టన్నులు

రేషన్‌ తీసుకోనివారు: 13,400

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement