
పారిశుధ్యం.. పచ్చదనం
కరీంనగర్రూరల్: కరీంనగర్ మండలం చామనపల్లి గ్రామపంచాయతీ పారిశుధ్య నిర్వహణ, పచ్చదనం పెంపొందించడంలో రాష్ట్రస్థాయిలో ఉత్తమ గ్రామపంచాయతీగా ఎంపికై మొదటి బహుమతి సాధించింది. గతేడాదికాలంగా గ్రామంలో పారిశు ధ్య నిర్వహణకు పంచాయతీ కార్యదర్శి కోరుకంటి మహేందర్రావు ప్రత్యేక చర్యలు చేపట్టారు. గ్రామంలో ట్రాక్టర్ ద్వారా సేకరించిన తడి,పొడి చెత్తను పంచాయతీ సిబ్బంది వేరు చేసి కంపోస్టుషెడ్లోని ప్రత్యేక అరల్లో భద్రపరుస్తున్నారు. ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ, పునర్వినియోగం చేస్తున్నారు. కంపోస్టుషెడ్, రింగ్కంపోస్టులో చెత్తను సేంద్రియ ఎరువుగా తయారు చేసి నర్సరీలోని మొక్కలకు ఎరువుగా వినియోగిస్తున్నారు. నర్సరీలో ప్రత్యేకంగా విటవిన్గార్డెన్ను ఏర్పాటు చేసి గంగావళి, పాలకూర తదితర ఆకుకూరలు పెంచుతున్నారు. హరితహారంలో భాగంగా అంతర్గత రోడ్లు, ప్రధాన రహదారికి ఇరువైపుల నాటిన మొక్కలతో పచ్చదనం పరుచుకుంది. ప్రతి ప్రధాన వీధి చివరలో మురికినీరు ఇంకిపోయేలా కమ్యూనిటీ ఇంకుడుగుంతలు నిర్మించారు. అండర్గ్రౌండ్ డ్రైనేజీలతో చెత్తచెదారం లేకపోవడంతో ప్రధాన రహదారులు పరిశుభ్రంగా ఉంటున్నాయి. ఇటీవల రాజస్థాన్ ప్రజాప్రతినిధులు, అధికారుల బృందం సభ్యలు చామనపల్లిని సందర్శించారు. స్వచ్ఛదనం– పచ్చదనంతోపాటు పారిశుధ్య నిర్వహణలో రాష్ట్రస్థాయిలో ములుగు జిల్లా మల్లంపల్లి, ఖమ్మం జిల్లా మేడేపల్లి, కరీంనగర్ మండలం చామనపల్లి ఎంపిక కాగా చామనపల్లికి మొదటి బహుమతి లభించింది. రాష్ట్రస్థాయి బహుమతి సాధించేందుకు కృషి చేసిన పంచాయతీ కార్యదర్శి మహేందర్రావును పంచాయతీరాజ్ జాయింట్ కమిషనర్ రవీందర్, డిప్యూటీ కమిషనర్ జాన్వెస్లీ, ఎస్బీఎం స్టేట్ డైరెక్టర్ సురేశ్బాబు, కరీంనగర్ ఎంపీవో జగన్మోహన్రెడ్డి, మాజీ సర్పంచ్ బోగొండ లక్ష్మిఐలయ్య అభినందించారు.
● రాష్ట్ర ఉత్తమ గ్రామపంచాయతీగా చామనపల్లి.. గ్రామస్తుల హర్షం

పారిశుధ్యం.. పచ్చదనం

పారిశుధ్యం.. పచ్చదనం