
ఉద్యమనేతల మాటముచ్చట
ముస్తాబాద్(సిరిసిల్ల): ప్రజాసమస్యలపై అలుపెరగని పోరాటాల నేపథ్యం వారిది. ఒకరు పాటతో చైతన్యం కలిగిస్తే.. మరొకరు బోధనలతో ఉద్యమాన్ని ఉవ్వెత్తున లేపారు. బడుగు, బలహీనవర్గాల తరఫున నేనున్నానంటూ పిడికిలి ఎత్తిన నేత మరొకరు.. వీరందరూ గురువారం ఒక్కచోట చేరారు. రాజన్నసిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం ఆవునూర్లో సీపీఐ జిల్లా కార్యదర్శి గుంటి వేణు కుమారుడు అభిలాశ్–శివాని వివాహం జరిగింది. ఈ పెళ్లికి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, ఎమ్మెల్సీలు కోదండరాం, నెల్లికంటి సత్యం, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, జనశక్తి అగ్రనేత అమర్, విమలక్క, మాజీ ఎమ్మెల్యే చలపతిరావు, జెడ్పీ మాజీ చైర్పర్సన్ తుల ఉమ, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్లు పెళ్లి మండపంలో కలుసుకున్నారు. కుశలప్రశ్నలు వేసుకుంటూ గడిపారు.