‘రియల్‌’ వ్యాపారంలో నష్టాలు | - | Sakshi
Sakshi News home page

‘రియల్‌’ వ్యాపారంలో నష్టాలు

Jun 5 2025 7:36 AM | Updated on Jun 5 2025 7:36 AM

‘రియల

‘రియల్‌’ వ్యాపారంలో నష్టాలు

వ్యాపారి ఆత్మహత్య

జూలపల్లి(పెద్దపల్లి): రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం సరిగా సాగక నష్టాలు చవిచూసిన తెలుకుంట చెందిన రియల్టర్‌ కోడూరి సతీశ్‌కుమార్‌(38) ఆత్మహత్య చేసుకున్నాడు. బతుకు దెరువు నిమిత్తం కరీంనగర్‌ వచ్చి రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేయగా నష్టాలు రావడంతో చొప్పదండిలో ఫాస్ట్‌పుడ్‌ సెంటర్‌ ప్రారంభించాడు. అదికూడా కలిసి రాకపోవడంతో అప్పుల పాలయ్యాడు. దీంతో మానసికంగా కుంగిపోయి ఆత్మహత్య చేసుకున్నాడని మృతుడి తండ్రి నారాయణ ఫిర్యాదు చేశారు. ఈమేరకు ఎస్సై సనత్‌ కుమార్‌ కేసు నమోదు చేశారు. మృతుడికి భార్య మౌనిక, ఇద్దరు పిల్లలు ఉన్నారు.

ద్విచక్ర వాహనం అదుపు తప్పి వ్యక్తి మృతి

సుల్తానాబాద్‌రూరల్‌(పెద్దపల్లి): ద్విచక్ర వాహనం అదుపుతప్పి వ్యక్తి మృతి చెందిన సంఘటన కాట్నపల్లి శివారులో బుధవారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన కూకట్ల రమేశ్‌(40) పనినిమిత్తం ద్విచక్ర వాహనంపై ఎలిగేడు మండలం శిపల్లికి వెళ్లి తిరుగు ప్రయాణంలో కాట్నపల్లి – శివపల్లి మధ్య అదుపు తప్పి బోల్తాపడ్డాడు. తీవ్రగాయాలతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య, కుమారుడు ఉన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం సుల్తానాబాద్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించిచారు.

ఆర్టీసీ బస్సు ఢీకొని వృద్ధురాలి దుర్మరణం

పెగడపల్లి: మండలంలోని నర్సింహునిపేట గ్రామంలో బుధవారం ఆర్టీసీ బస్సు ఢీకొని మ్యాన రాజవ్వ(75) మృతి చెందింది. పోలీసుల వివరాల ప్రకారం.. మల్యాలకు చెందిన మ్యాన రాజవ్వ రెండ్రోజుల క్రితం తన తమ్ముడు అడెపు భూమయ్య ఇంటికి వచ్చింది. తిరుగు ప్రయాణంలో మల్యాల వెళ్లేందుకు రోడ్డుపైకి వచ్చి బస్సు కోసం వేచి చూస్తోంది. కరీంనగర్‌ నుంచి పెగడపల్లి వెళ్లే బస్సు వచ్చి ఆగింది. రాజవ్వ బస్సు ఎక్కేందుకు ప్రయత్నిస్తుండగా గమనించని డ్రైవర్‌ ముందుకు పోనిచ్చాడు. దీంతో రాజవ్వ బస్సు టైర్ల కింద పడి చనిపోయింది. బస్సు డ్రైవర్‌ కనుకయ్య నిర్లక్ష్యంతో తన తల్లి మృతి చెందిందని రాజవ్వ కొడుకు గంగాధర్‌ ఫిర్యాదుతో ఎస్‌హెచ్‌వో రవీందర్‌ కేసు నమోదు చేశారు.

డాక్టర్‌పై సస్పెన్షన్‌ వేటు

మంథని: పట్టణంలోని సామాజిక ఆస్పత్రిలో మత్తుమందు ప్రత్యేక వైద్యుడిగా విధులు నిర్వహిస్తున్న డాక్టర్‌ మోహన్‌రావు.. ట్యూబెక్టమీ ఆపరేషన్‌ కోసం పేషెంట్‌ వద్ద లంచం డిమాండ్‌ చేసినందుకు సస్పెండ్‌ చేస్తూ కలెక్టర్‌ కోయ శ్రీహర్ష బుధవారం ఉత్తర్వులు జారీచేశారు. రచ్చపల్లి గ్రామానికి చెందిన పేషంట్‌ కొడాలి భాగ్య నుంచి ట్యూబెక్టమీ ఆపరేషన్‌ కోసం డాక్టర్‌ రూ.5వేలు లంచం డిమాండ్‌ చేస్తూ దొరికిపోయారని, ఆ డాక్టర్‌పై ఇప్పటికే పలు ఫిర్యాదులు నమోదైన నేపథ్యంలో సస్పెండ్‌ చేస్తున్నట్లు కలెక్టర్‌ ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

‘రియల్‌’ వ్యాపారంలో నష్టాలు 1
1/2

‘రియల్‌’ వ్యాపారంలో నష్టాలు

‘రియల్‌’ వ్యాపారంలో నష్టాలు 2
2/2

‘రియల్‌’ వ్యాపారంలో నష్టాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement