గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి | - | Sakshi
Sakshi News home page

గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి

Jun 2 2025 12:20 AM | Updated on Jun 2 2025 12:20 AM

గుర్త

గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి

ముస్తాబాద్‌(సిరిసిల్ల): మండలంలోని గూడూరు స్టేజీ వద్ద గుర్తుతెలియని వాహనం ఢీకొట్టిన సంఘటనలో ఒకరు అక్కడికక్కడే మృతిచెందాడు. ఎస్సై చిందం గణేశ్‌ తెలిపిన వివరాలు. ముస్తాబాద్‌కు చెందిన కూర సిద్దిరాములు(56) నామాపూర్‌లోని ఓ రైస్‌మిల్‌లో గుమస్తాగా పనిచేస్తున్నాడు. ఆదివారం విధులు ముగించుకొని బైక్‌పై ముస్తాబాద్‌కు తిరిగి వస్తుండగా గుర్తు తెలియని డీసీఎం వ్యాన్‌ ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడ్డ సిద్దిరాములు అక్కడికక్కడే మృతిచెందాడు. బైక్‌ను ఢీకొట్టిన వాహనం వేగంగా కామారెడ్డి వైపు వెళ్లింది. సిద్దిరాములు మృతికి కారణమైన వాహనాన్ని పట్టుకునేందుకు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. మృతుడికి భార్య లక్ష్మి, కూతురు సంగీత ఉన్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై గణేశ్‌ తెలిపారు.

రోడ్డు ప్రమాదంలో వృద్ధుడు..

సుల్తానాబాద్‌ రూరల్‌(పెద్దపల్లి): కారు ఢీకొని వృద్ధుడు మృతి చెందిన సంఘటన కనుకుల గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన తాళ్లపల్లి కొమురయ్య(85) తన ఇంటినుంచి బస్టాండ్‌కు నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఈక్రమంలో అతివేగంగా వెళ్తున్న కారు వెనుకనుంచి వచ్చి ఢీకొట్టింది. దీంతో తీవ్రగాయాలతో రక్తస్రావం జరిగి వృద్ధుడు అక్కడికక్కడే మృతి చెందాడు. వృద్ధుడికి ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

గుర్తుతెలియని మృతదేహం లభ్యం

కరీంనగర్‌క్రైం: కరీంనగర్‌ వన్‌టౌన్‌ పరిధిలోని ఓ లాడ్జి వద్ద గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. వన్‌టౌన్‌ పోలీసుస్టేషన్‌ ఎదురుగా ఉన్న లాడ్జి సమీపంలో సుమారు 55ఏళ్ల పైబడిన వ్యక్తి మృతదేహం లభ్యమైందని పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించినట్లు వెల్లడించారు. వివరాలకు వన్‌టౌన్‌ పోలీసులను సంప్రదించాలని సూచించారు.

ద్విచక్ర వాహనాలు ఢీకొని నలుగురికి గాయాలు

ఫెర్టిలైజర్‌సిటీ(రామగుండం): రామగుండం కార్పొరేషన్‌ 39వ డివిజన్‌ గౌతమినగర్‌ ప్రధాన రహదారిపై ప్రగతినగర్‌లో ఆదివారం రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈప్రమాదంలో సమతకారి నరసింహస్వామి, దుగ్గల అరుణ్‌కుమార్‌, బంగారి కవినిక్‌, సిలివేరి అక్షయ్‌కుమార్‌ తీవ్రంగా గాయపడ్డారు. బాధితులను గోదావరిఖని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఎస్సై ఉదయ్‌ కిరణ్‌ కేసు నమోదు చేసుకొన్నారు.

గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి1
1/2

గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి

గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి2
2/2

గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement