ఐఐటీ అడ్వాన్స్‌డ్‌లో అల్ఫోర్స్‌కు ర్యాంకులు | - | Sakshi
Sakshi News home page

ఐఐటీ అడ్వాన్స్‌డ్‌లో అల్ఫోర్స్‌కు ర్యాంకులు

Jun 3 2025 12:12 AM | Updated on Jun 3 2025 12:12 AM

ఐఐటీ

ఐఐటీ అడ్వాన్స్‌డ్‌లో అల్ఫోర్స్‌కు ర్యాంకులు

ఎస్‌ఆర్‌ విద్యార్థుల విజయకేతనం

కరీంనగర్‌: జేఈఈ అడ్వాన్స్‌డ్‌ ఫలితాల్లో ఎస్‌ఆర్‌ విద్యార్థులు వివిధ కేటగిరీలలో జాతీయస్థాయిలో అద్భుత ర్యాంకులు సాధించారు. ఎస్‌.పవన్‌ 204వ ర్యాంక్‌, ఎం.కార్తీక్‌ 1,009, బానోవత్‌ సుమన్‌ 1,049, బుర్ర మాధవ్‌ 1,471, నీరటి శ్రీచరణ్‌జోష్‌ 1,321, గుగులోతు శేఖర్‌ 1,328, ముదిగంటి రుషిశ్వర్‌రెడ్డి 2,318, దొనకొండ సాయిచందన 3,218, దయ్యాల రాజ్‌కుమార్‌ 6,519వ ర్యాంకు సాధించి విద్యాసంస్థల ప్రతిభను మరింత పెంచారని విద్యాసంస్థల అధినేత వరదారెడ్డి పేర్కొన్నారు. పటిష్ట ప్రణాళికతో విద్యాబోధన, నిరంతర పర్యవేక్షణ, విద్యార్థుల అహర్నిశల కృషి ఇంతటి ఘన విజయానికి తోడ్పడ్డాయని వివరించారు. అద్భుత ర్యాంకులు సాధించిన విద్యార్థులను, తల్లిదండ్రులను, అధ్యాపక బృందానికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో డైరెక్టర్‌ సంతోష్‌రెడ్డి, డీజీఎం, సీఈవో, జోనల్‌ ఇన్‌చార్జిలు, అకాడమిక్‌ డీన్స్‌, ప్రిన్సిపాల్స్‌ పాల్గొన్నారు.

ట్రినిటీ విద్యార్థుల విజయభేరి

కరీంనగర్‌: జేఈఈ–అడ్వాన్స్‌డ్‌ ఫలితాల్లో ట్రినిటీ జూనియర్‌ కళాశాలల విద్యార్థులు విజయభేరి మోగించారు. ఎ.రఘుపతి జాతీయస్థాయిలో 40వ ర్యాంకు, నిఖిత్‌నాయక్‌ 194, డి.మహేశ్‌ 225, రఘుపతి 226, బి.సిద్ధిక 1,107, సీహెచ్‌.ఐశ్వర్య 1,129, ఠాగూర్‌ 1,274, నవదీప్‌ 1,701, నిస్సీ జాస్పర్‌ 2,172, ఎ.అజయ్‌ 3,077, అక్షర 4,524 ర్యాంకు సాధించారు. ఈ సందర్భంగా కళాశాల ఫౌండర్‌ చైర్మన్‌ దాసరి మనోహర్‌రెడ్డి మాట్లాడుతూ, స్పష్టమైన ప్రణాళిక, మెరుగైన విద్యా బోధన, నిష్ణాతులైన అధ్యాపకుల పర్యవేక్షణలో ఉత్తమ ర్యాంకులు సాధించామని తెలిపారు. విద్యార్థుల ప్రతిభను గుర్తించి, అందుకు అనుగుణంగా బోధనా పద్ధతులు అవలంబించిడం జరుగుతుందని, ర్యాంకులు సాధించిన విద్యార్థులను అభినందించారు. ఎస్సెస్సీలో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు తమ కాలేజీలో ఫీజు రాయితీ ఇస్తున్నామని వివరించారు. ఈఏడాది నుంచి ఐఐటీ–అడ్వాన్స్‌డ్‌ లాంగ్‌టర్మ్‌ ప్రారంభిస్తామని పేర్కొన్నారు. రాబోయే నీట్‌ ఫలితాల్లో అత్యుత్తమ మార్కులు సాధిస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. కళాశాల చైర్మన్‌ దాసరి ప్రశాంత్‌రెడ్డి మాట్లాడుతూ, ఉత్తమ ర్యాంకుల సాధన కేవలం ట్రినిటీ కళాశాలలకే సాధ్యమని, విద్యార్థుల కృషి, యాజమాన్యం భరోసా, అధ్యాపకుల శ్రద్ధ వల్లే ఈ ఫలితాలు అని తెలిపారు. క్యాంపస్‌ ప్రిన్సిపాల్స్‌, అధ్యాపకులు పాల్గొన్నారు.

కొత్తపల్లి(కరీంనగర్‌): అల్ఫోర్స్‌ విద్యాసంస్థల విద్యార్థులు సోమవారం ప్రకటించిన ఐఐటీ అడ్వాన్స్‌డ్‌–2025 ఫలితాల వివిధ కేటగిరీల జాతీయస్థాయిలో అద్భుత ర్యాంకులు సాధించినట్లు ఆ విద్యాసంస్థల చైర్మన్‌ డా.వి.నరేందర్‌రెడ్డి తెలిపారు. అజ్మీరా పురుషోత్త్తంనాయక్‌ 166వ ర్యాంకు సాధించగా.. పి.ఎన్‌.సాయిధృవ 557, ఎన్‌.అనిరుధ్‌సాయి 657, బి.ఆదిత్య 945, బి.విష్ణు 1,203, ఎం.అక్షిత 1,224, వి.హృషికేశ్‌ 1,329, ఆర్‌.గోవర్ధన్‌ 1,506, జె.వామిక 1,604, బి.చైశ్రవ్‌ రాజు 1,640, ఇ.శశిలాల్‌ 1,899, కె.విరేంద్రప్రసాద్‌ 2,120, డి.కార్తీక్‌రెడి్‌డ్‌ 2,150, ఎస్‌.విఘ్నేశ్‌ 2,293, డి.అభిరామ్‌ 2,349, ఎ.శశిప్రితమ్‌ 2,463, ఇ.అంకిత్‌సాయి 2,613, మహ్మద్‌ అబ్ధుల్‌ హక్‌ 2,766, డి.విశాల్‌ 2,917 ర్యాంకులు సాధించి అల్ఫోర్స్‌ ఖ్యాతిని పెంచారని సంతోషం వ్యక్తం చేశారు. వెయ్యి లోపు నలుగురు, 2వేల లోపు 11 మంది, 3వేల లోపు 19 మంది విద్యార్థులు ర్యాంకులు సాధించినట్లు చెప్పారు.

ఐఐటీ అడ్వాన్స్‌డ్‌లో అల్ఫోర్స్‌కు ర్యాంకులు1
1/2

ఐఐటీ అడ్వాన్స్‌డ్‌లో అల్ఫోర్స్‌కు ర్యాంకులు

ఐఐటీ అడ్వాన్స్‌డ్‌లో అల్ఫోర్స్‌కు ర్యాంకులు2
2/2

ఐఐటీ అడ్వాన్స్‌డ్‌లో అల్ఫోర్స్‌కు ర్యాంకులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement