
ఏసీబీ వలలో ఇన్చార్జి తహసీల్దార్
● భూమి రిజిస్ట్రేషన్ కోసం రూ.15 వేల బేరం
● రూ.10 వేలు లంచం తీసుకుంటుండగా పట్టుకున్న ఏసీబీ డీఎస్పీ
● ప్రైవేటు డాక్యుమెంట్ రైటర్ మధ్యవర్తితో లంచం
రాయికల్(జగిత్యాల): భూమి రిజిస్ట్రేషన్ కోసం రూ.15 వేల లంచం బేరం కుదుర్చుకుని రూ.10 వేల డబ్బులను రాయికల్ ఇన్చార్జి తహసీల్దార్ గణేశ్, ప్రైవేటు డాక్యుమెంట్ రైటర్ ముజాఫర్ మధ్యవర్తితో తీసుకుంటుండగా ఏసీబీ డీఎస్పీ రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. డీఎస్పీ విజయ్కుమార్ వివరాల ప్రకారం.. జగిత్యాల జిల్లా రాయికల్ మండలం సింగరావుపేట గ్రామానికి చెందిన గాజర్ల రవి తన 1.025 ఎకరాల భూమిని రిజిస్ట్రేషన్ చేయించుకోవడం కోసం వారం క్రితం ఇన్చార్జి తహసీల్దార్ గణేశ్ను సంప్రదించగా రూ.15 వేలు లంచం డిమాండ్ చేశాడు. మధ్యవర్తిగా ప్రైవేటు డాక్యుమెంట్ రైటర్ ముజాఫర్ సంప్రదింపులతో బేరం కుదుర్చుకున్నారు. ఈ విషయమై బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించగా పక్కా ప్రణాళికతో మంగళవారం తహసీల్ కార్యాలయంలో రూ.10 వేలు మధ్యవర్తి ముజాఫర్ ద్వారా ఇస్తుండగా రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఇన్చార్జి తహసీల్దార్ గణేశ్, ముజాఫర్ను రిమాండ్కు తరలిస్తున్నట్లు తెలిపారు. దాడుల్లో ఇన్స్పెక్టర్లు తిరుపతి, కిరణ్రెడ్డి పాల్గొన్నారు.