జగిత్యాలక్రైం: రోడ్డు ప్రమాదం కేసును మల్యాల సీఐ నీరుగార్చుతున్నారని, వాహనదారునికి వత్తాసు పలుకుతున్నాడని మృతుడి కుటుంబ సభ్యులు మంగళవారం జగిత్యాల ఎస్పీ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. వివరాలు.. మల్యాల మండలం రాంపూర్ గ్రామానికి చెందిన అల్లెపు నరేశ్ ఏప్రిల్ 28న రాజారం వద్ద లారీ ఢీకొని మృతిచెందాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి లారీని స్టేషన్కు తరలించారు.లారీకి ఇన్సూరెన్స్ ఉందని, పరిహారం వస్తుందని మృతుడి కుటుంబ సభ్యులకు నచ్చజెప్పారు. దీంతో చివరికి లారీని వదిలిపెట్టి ప్రస్తుతం లారీకి ఇన్సూరెన్స్ లేదని మల్యాల సీఐ కేసును నీరుగార్చుతున్నారని, తమను నిత్యం పోలీస్స్టేషన్కు రమ్మని రోజుకో కారణం చెబుతూ అన్యాయం చేస్తున్నాడని ఆరోపించారు. దీంతో నరేశ్ తండ్రి అల్లెపు బాలయ్య, తల్లి శారదతో పాటు పలువురు బంధువులు ఎస్పీ కార్యాలయం ముందు ఆందోళన చేపట్టారు.