
జ్యోతినగర్(రామగుండం): ఎన్టీపీసీ మేడిపల్లి సెంటర్ రాజీవ్ రహదారిపై ఆదివారం బైక్ను వెనుక నుంచి ఆటో ఢీ కొనడంతో ఇద్దరికి గాయాలయ్యాయి. వివరాలిలా ఉన్నాయి.. రామగుండం మల్యాలపల్లికి చెందిన రాజేశ్ తన సమీప బంధువైన శారదను ఎన్టీపీసీ పోలీస్స్టేషన్ పరిధిలోని ఖాజిపల్లి గ్రామం నుంచి బైక్పై మల్యాలపల్లికి తీసుకెళ్తున్నాడు. ఈక్రమంలో మేడిపల్లి సెంటర్లో అదేమార్గంలో వేగంగా వచ్చిన ఆటో వెనుక నుంచి బైక్ను ఢీకొంది. దీంతో బైక్పై ఉన్న ఇద్దరికి గాయాలయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం ఆటోలో గోదావరిఖని ప్రభుత్వ ప్రాంతీయ ఆస్పత్రికితీసుకెళ్లారు.
కానిస్టేబుల్పై దాడి
కోనరావుపేట: మండలంలోని రామన్నపేటలో బోనాల ఉత్సవంలో బందోబస్తుకు వచ్చిన ఓ కానిస్టేబుల్పై దాడి జరిగింది. గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు జాతరలో గొడవ పడుతుండగా అక్కడే ఉన్న కానిస్టేబుల్ రవి వీడియో తీస్తుండడాన్ని గమనించిన ఓ యువకుడు ఆగ్రహించి కర్రను కానిస్టేబుల్పైకి విసిరాడు. కానిస్టేబుల్ తలకు గాయమై తీవ్ర రక్తస్రావం కాగా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.