
సీఐలు పోలీస్స్టేషన్లను సందర్శించాలి
కరీంనగర్క్రైం: సీఐలు తమ పరిధిలోని పోలీస్స్టేషన్లను తరచూ సందర్శిస్తూ సిబ్బంది పనితీరును పర్యవేక్షించాలని సీపీ గౌస్ ఆలం సూచించారు. పోలీస్ కమిషనరేట్ కేంద్రంలోని కాన్ఫరెన్స్ హాలులో మంగళవారం నెలవారీ నేరసమీక్ష నిర్వహించారు. సీపీ మాట్లాడుతూ.. పిటిషన్ మేనేజ్మెంట్ సిస్టమ్ను సరైన పద్ధతిలో అమలు చేయాలని ఆదేశించారు. డివిజన్ల వారీగా ఏసీపీలు సమీక్షలు నిర్వహించాలన్నారు. రికార్డు నిర్వహణ, రిసెప్షన్, కోర్టుడ్యూటీ, డ్రంకెన్డ్రైవ్ తనిఖీలు, బీట్, పెట్రోలింగ్, పాయింట్బుక్ల ఏర్పాటు, సమన్ల జారీ వంటి విధులను సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు. అడిషనల్ డీసీపీ ఎ.లక్ష్మీనారాయణ, రూరల్ ఏసీపీ శుభం ప్రకాశ్, ట్రైనీ ఐపీఎస్ వసుంధర, అడిషనల్ ఎస్పీ నరేందర్, ఏసీపీలు వెంకటస్వామి, శ్రీనివాస్, యాదగిరిస్వామి, శ్రీనివాస్, మాధవి, వేణుగోపాల్, కాశయ్య, సీఐలు పాల్గొన్నారు.
● సీపీ గౌస్ ఆలం