బాన్సువాడ రూరల్: మండలకేంద్రంలోని తాడ్కోల్ చౌరస్తా సమీపంలో గల తిరుమల రైస్మిల్ ఆధ్వర్యంలో నాగులగామ వెంకన్న ఏర్పాటు చేసిన చలివేంద్రం, అంబలికేంద్రాన్ని బుధవారం రాష్ట్ర వ్యవసాయ సలహాదారులు పోచారం శ్రీనివాస్రెడ్డి ప్రారంభించారు. తన తండ్రి దివంగత గిర్మయ్య అడుగుజాడల్లో నడుస్తూ సేవాకార్యక్రమాలను వెంకన్న కొసాగిస్తుండం అభినందనీయమని పోచారం శ్రీనివాస్రెడ్డి అన్నారు. నాయకులు కాసుల బాలరాజు, పిట్ల శ్రీధర్, నార్లసురేష్ గుప్తా, గురువినయ్, నార్లరవీందర్, గౌస్ పాల్గొన్నారు.


