భిక్కనూరు : ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల కోసం స్థానిక ఎమ్మెల్యే డెస్క్ బెంచీలను అందిస్తుండడం అభినందనీయమని తపస్ రాష్ట్ర కార్యదర్శి పుల్గం రాఘవరెడ్డి పేర్కొన్నారు. శనివారం తిప్పాపూర్లోని పాఠశాలకు బెంచీలను అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి తన తండ్రి కేపీ రాజారెడ్డి పేరిట ఏర్పాటు చేసిన జనసేవా ట్రస్టు ద్వారా నియోజకవర్గంలో ప్రభుత్వ పాఠశాలలకు 6 వేల డెస్క్ బెంచీలను అందిస్తున్నారన్నారు. విద్యార్థులకు బెంచీలను సమకూర్చిన ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం యాదగిరి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
భిక్కనూరు: మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలకు డెస్క్ బెంచీలను అందించారు. ఈ సందర్భంగా బీజేపీ మండలాధ్యక్షుడు ఉప్పరి రమేశ్ మాట్లాడుతూ మండలంలోని 13 పాఠశాలలకు కలిపి 529 డెస్క్ బెంచీలను ఎమ్మెల్యే పంపించారన్నారు. వాటిని ఆయా పాఠశాలలకు పంపిణీ చేశామన్నారు.


