మధ్యతరగతికి భారీ ఆదా | - | Sakshi
Sakshi News home page

మధ్యతరగతికి భారీ ఆదా

Sep 23 2025 7:47 AM | Updated on Sep 23 2025 7:47 AM

మధ్యత

మధ్యతరగతికి భారీ ఆదా

అమలులోకి వచ్చిన

జీఎస్టీ కొత్త శ్లాబులు

తగ్గిన ధరలు

హర్షం వ్యక్తం చేస్తున్న

వివిధ వర్గాల ప్రజలు

జీఎస్టీ తగ్గింపు ఊరటనిచ్చే అంశం

అనేక రకాల సామగ్రిపై జీఎ స్టీ తగ్గించడం ఎంతో ఊరటనిచ్చే అంశం. జీఎస్టీ తగ్గింపు వల్ల ధరలు తగ్గడంతో పాటు కొనుగోళ్లు పెరగడానికి అవకాశం ఉంది. సామాన్యులకు ఆర్థిక భారం తగ్గుతుంది. విలాసవంతమైన సామగ్రిపై జీఎస్టీ భారం ఉన్నా మధ్య తరగతి వారికి ఎలాంటి ఇబ్బంది లేదు. – లక్ష్మీనారాయణ,

లెక్చరర్‌, జూనియర్‌ కళాశాల, మోర్తాడ్‌

సాక్షి ప్రతినిధి, నిజామాబాద్‌: జీఎస్టీ కొత్త శ్లాబుల అమలుతో వివిధ వస్తువుల ధరలు తగ్గడంతో ఆయా వర్గాల్లో హర్షం వ్యక్తమవుతోంది. గ తంలో ఉన్న 5, 12, 18, 28 శాతం శ్లాబు ల స్థానంలో 5,18 శాతం శ్లాబులు మాత్రమే ఉంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. దీంతో ఆయా వస్తువుల ధరలు తగ్గుతుండడంతో డబ్బులు ఆదా అవుతా యని పలువురు పేర్కొంటున్నారు. ప్రజలు దీని గురించి ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. సిగరెట్లు, గుట్కా, పాన్‌మసాలాలపై 40 శాతం జీఎస్టీ విధించడంపై మహిళలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

కొనుగోలు శక్తి పెరుగుతుంది..

ప్రజల కొనుగోలు శక్తి పెరిగేందుకు జీఎస్టీ సంస్కర ణలు ఉపయోగపడతాయి. అదేవిధంగా స్వదేశీ ఉత్పత్తులకు మరింత వైభవం తీసుకొచ్చేందుకు మోదీ ప్రభుత్వం కచ్చితమైన ప్రణాళికతో ముందుకు వెళుతోంది. విద్యార్థులకు ఉపయోగపడే స్టేషనరీ లాంటి వస్తువులకు జీరో ట్యాక్స్‌, ఆరోగ్య బీమాకు పన్ను లేకుండా చేశారు. కిరాణా, వ్యవసాయ పరికరాలు, ఔషధాలపై 5 శాతానికి పన్ను తగ్గించారు. చిన్న కార్లు, బైకులు, కంప్యూటర్లు, వివిధ రకాల గృహోపకరణాలపై 10 శాతం పన్ను తగ్గింది.

– ధర్మపురి అర్వింద్‌, ఎంపీ

మధ్యతరగతికి భారీ ఆదా1
1/2

మధ్యతరగతికి భారీ ఆదా

మధ్యతరగతికి భారీ ఆదా2
2/2

మధ్యతరగతికి భారీ ఆదా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement