
ప్రభుత్వాస్పత్రిలో కుమారుడికి టీకా వేయించిన సబ్ కలెక్
బాన్సువాడ : బాన్సువాడ మాతా శిశు సంరక్షణ ఆస్పత్రిలో బుధవారం తన కుమారుడికి టీకా వేసి సబ్ కలెక్టర్ కిరణ్మయి ఆదర్శంగా నిలిచారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్య సేవల పట్ల ప్రజలకు నమ్మకం కలిగించేందుకు బూ స్టర్ డోస్ టీకా వేయించినట్లు తెలిపారు. ప్ర జలు ప్రభుత్వ ఆస్పత్రిల్లో వైద్య సేవలు వినియోగించుకోవాలని సూచించారు. ఆస్పత్రి సిబ్బంది పని తీరుపై సంతృప్తి వ్యక్తం చేశా రు. ఆస్పత్రి సూపరింటెండెంట్ విజయలక్ష్మి, ఏఎన్ఎం అమృత తదితరులున్నారు.
కొనసాగుతున్న అడ్వాన్స్డ్
ఇంటర్ పరీక్షలు
కామారెడ్డి అర్బన్: ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయని జిల్లా నోడల్ అధికారి షేక్ సలాం అన్నారు. ఫస్టియర్ బ్రిడ్ట్ కోర్సు పరీక్షలకు 33 మంది హాల్టికెట్లు పొందగా 24 మంది హాజరయ్యారు. సెకండియర్ పరీక్షలకు 9 మంది హాల్ టిక్కెట్లు పొందగా ముగ్గురు మాత్రమే పరీక్ష రాశారు.
నియోజకవర్గ సమావేశాన్ని
విజయవంతం చేయాలి
కామారెడ్డి టౌన్: జిల్లా కేంద్రంలోని సిరిసిల్ల రోడ్లోని కింగ్స్ కన్వెన్షన్ హాల్లో నేడు జరి గే కామారెడ్డి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కా ర్యకర్తల విస్తృతస్థాయి సమావేశాన్ని విజయవంతం చేయాలని డీసీసీ అధ్యక్షుడు కై లాస్ శ్రీనివాస్రావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 11 గంటలకు జరిగే ఈ సమావేశానికి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు ష బ్బీర్ అలీ హాజరవుతున్నట్లు తెలిపారు.
విద్యుత్ అధికారులకు సమాచారమివ్వాలి
కామారెడ్డి అర్బన్ : విద్యుత్ స్తంభాల ద్వారా కేబుల్ వైర్లను వేస్తున్న ఆపరేటర్లు విద్యుత్ అ ధికారులకు సమాచారమివ్వాలని జిల్లా ఎస్ ఈ శ్రావణ్కుమార్ సూచించారు. బుధవా రం ఎస్ఈ తన కార్యాలయంలో వివిధ కేబు ల్ ఆపరేటర్లతో సమావేశం నిర్వహించి మా ట్లాడారు. వైర్లు, కేబుళ్లకు సంబంధించి వివరాలను కచ్చితంగా పేర్కొనాలన్నారు. వి ద్యుత్ ఆపరేషన్స్ అధికారులు రాజశేఖర్, గో పాల్రెడ్డి, కల్యాణ్ చక్రవర్తి తదితరులు పా ల్గొన్నారు.
ఈ–శ్రమ పోర్టల్పై అవగాహన
బాన్సువాడ: భవన నిర్మాణ కార్మికులకు ఈ–శ్రమ పోర్టల్పై బుధవారం బాన్సువాడలో కార్మిక శాఖ బాన్సువాడ డివిజన్ సహాయ అధికారి ఇబ్రహీం జుబేర్ అవగాహన కల్పించారు. వివిధ రంగాల్లో పని చేస్తున్న ప్రతి కార్మికుడు ఈ–శ్రమ పోర్టల్లో పేర్లు నమోదు చేసుకోవాలని, కార్మిక శాఖ నుంచి గుర్తింపు కార్డులు పొందాలని అన్నారు. పోర్టల్లో నమోదు చేసుకుంటే కార్మికులకు రూ. 2 లక్షల ప్రమాద బీమా వర్తిస్తుందని అన్నారు. బీడీ కార్మికులకు దగ్గు, జ్వరం వంటి లక్షణాలు ఉంటే వెంటనే ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చికిత్స చేయించుకోవాలని సూచించారు. కార్మిక శాఖ జూనియర్ అసిస్టెంట్ సతీష్రెడ్డి ఉన్నారు.
సాగర్లోకి 581
క్యూసెక్కుల ఇన్ఫ్లో
నిజాంసాగర్(జుక్కల్): రెండు, మూడు రోజుల నుంచి విస్తారంగా కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకల్లో వరద నీటి ప్రవాహాలు ప్రారంభమయ్యాయి. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు నిజాంసాగర్ ప్రాజెక్టులోకి బుధవారం 581 క్యూసెక్కుల వరద నీరు ఇన్ఫ్లోగా వస్తోందని ప్రాజెక్టు అధికారులు తెలిపారు. నిజాంసాగర్ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1405 అడుగులు. 17.8 టీఎంసీలకు గాను 5.8 టీఎంసీల నీరు నిల్వ ఉంది. మహమ్మద్నగర్ మండలంలోని సింగితం రిజర్వాయర్లోకి స్వల్ప ఇన్ఫ్లో వస్తోంది. రిజర్వాయర్ పూర్తిస్థాయి నీటిమట్టం 416.5 మీటర్లు కాగా.. 408 మీటర్ల మేర నీరు నిల్వ ఉంది.

ప్రభుత్వాస్పత్రిలో కుమారుడికి టీకా వేయించిన సబ్ కలెక్