నాగమల్లితోట జంక్షన్ (కాకినాడ సిటీ): జిల్లా మాస్టర్స్ అథ్లెటిక్స్ సంఘం ఆధ్వర్యంలో కాకినాడ జిల్లా క్రీడామైదానంలో మంగళవారం మాస్టర్స్ అథ్లెటిక్స్ జిల్లా స్థాయి ఎంపిక పోటీలను ఉత్సాహంగా నిర్వహించారు. ఈ పోటీలను మాస్టర్స్ అథ్లెటిక్స్ సంఘ అధ్యక్షుడు కృష్ణమూర్తి, కార్యదర్శి బాపిరాజు ప్రారంభించారు. అథ్లెటిక్స్లో రన్, జంప్, త్రోస్లో పోటీలు నిర్వహించారు. ఈ నెల 30, 31 తేదీలలో నన్నయ యూనివర్శిటీలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలలో ఎంపికై న క్రీడాకారులు పాల్గొంటారన్నారు. విజేతలకు డీఎస్డీఓ వి.సతీష్కుమార్ బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో మాస్టర్స్ అథ్లెటిక్స్ సంఘ సభ్యులు, క్రీడాకారులు పాల్గొన్నారు.


