శిలాఫలకం ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే కృష్ణమోహన్రెడ్డి
గద్వాల క్రైం: జిల్లా ప్రభుత్వాస్పత్రి ఆవరణలో ఆదివారం సీసీ రోడ్డు నిర్మాణ పనుల కోసం స్థానిక ఎమ్మెల్యే కృష్ణమోహన్రెడ్డి భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆస్పత్రి అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానన్నారు. వివిధ సమస్యలతో ఆస్పత్రికి వచ్చే రోగులు పడుతున్న ఇబ్బందులను గుర్తించి రూ.10 లక్షల వ్యయంతో రోడ్డు ప నులు చేపట్టామన్నారు. ఆస్పత్రిలోని మౌలిక వసుతులు, సదుపాయాల కొరత లేకుండా చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ ఝాన్సీలక్ష్మి, మున్సిపల్ చైర్పర్సన్ జయలక్ష్మి తదితరులు ఉన్నారు.


