
డబ్బులు సరిపోవడం లేదు
ఇందిరమ్మ ఇంటికి దరఖాస్తు చేసుకోగా మాకు ఇల్లు మంజూరైంది. అయితే ప్రభుత్వం నుంచి రూ.5లక్షలు మంజూరు చేస్తామన్నా రు. ఇక్కడ రేట్లు పెరగడంతో ఇల్లు కట్టుకోలేక పోతున్నాం. ఇసుక, సిమెంట్, సీకుల ధరలు పెరగడంతో చాలా ఇబ్బందులు పడుతున్నాం. ఇప్పటికై నా ప్రభుత్వం మార్కెట్ రేటు ప్రకారం ఇందిరమ్మ ఇళ్లకు డబ్బులు పెంచాలి.
– హోటల్ పార్వతమ్మ, ఇర్కిచేడు, కేటీదొడ్డి మండలం, గద్వాల జిల్లా
ధరలు పెరిగాయి.. భారంగా మారింది..
ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసింది. నిర్మాణానికి అయ్యే ఖర్చులో కొంతభాగం ప్రభుత్వం అందించడం చాలా సంతోషంగా ఉంది. బేస్మెంట్ వరకు పూర్తి చేస్తే రూ.లక్ష బిల్లు వచ్చింది. కానీ ఇసుక, సిమెంట్, ఇటుక, కంకర, స్టీల్ ధరలు బాగా పెరగడంతో నిర్మాణం భారంగా మారింది. ఇసుక ఉచితంగా, స్టీల్, సిమెంట్, కంకర, ఇటుక తక్కువ ధరకు అందిస్తే బాగుంటుంది.
– చింతకాల గౌతమి, కడుకుంట్ల (వనపర్తి)
అప్పు చేసి నిర్మిస్తున్నాం..
ఇందిరమ్మ ఇల్లు మంజూరు కావడంతో ఎంతో ఆనందించాం. ఇల్లు అయితే ప్రారంభించాం కానీ నేటికీ ఇసుక అందుబాటులో లేక పడిగాపులు కాస్తున్నాం. ఇక సిమెంట్, రాయి, స్టీల్ ధరలు అంతకంతకూ పెరుగుతుండడంతో దిక్కుతోచడం లేదు. గౌండలకు, సెంట్రింగ్ ఖర్చులు అధికవవుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం రూ.5లక్షలు ఇస్తుండగా.. ఇప్పటికే రూ.3 లక్షలు అవుతున్నాయి. అప్పు చేసి ఇల్లు నిర్మించుకోవాల్సిన పరిస్థితి నెలకొంది.
– కృష్ణకుమార్, లబ్ధిదారుడు, ఉండవెల్లి
ఆధార్కార్డుల్లో తప్పులతో ఇబ్బంది
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల్లో వేగం పెంచాం. జిల్లాలో ఇప్పటివరకు 4,103 మంది లబ్ధిదారుల ఖాతాల్లో మొత్తం రూ.42.84 కోట్లు జమ చేశాం. ఆధార్కార్డుల్లో తప్పులతో పలువురికి సమస్యలు తలెత్తగా.. పరిష్కారానికి కృషి చేస్తున్నాం. జీఎస్టీ రేట్లు తగ్గనున్న నేపథ్యంలో ఇప్పటివరకు దూరంగా ఉన్న లబ్ధిదారులు ముందుకు వచ్చే అవకాశం ఉంది.
– వైద్యం భాస్కర్, గృహనిర్మాణ శాఖ పీడీ, మహబూబ్నగర్
●

డబ్బులు సరిపోవడం లేదు

డబ్బులు సరిపోవడం లేదు