1.73 లక్షల ఎకరాల్లో పంటలు సాగు | - | Sakshi
Sakshi News home page

1.73 లక్షల ఎకరాల్లో పంటలు సాగు

Aug 5 2025 6:43 AM | Updated on Aug 5 2025 6:43 AM

1.73 లక్షల ఎకరాల్లో పంటలు సాగు

1.73 లక్షల ఎకరాల్లో పంటలు సాగు

మే నెలలో వర్షాలు కురవడంతో మెట్ట పంటలు సాగుచేసుకునేందుకు రైతులు భూములు దుక్కులు దున్నుకుని సిద్ధం చేసుకున్నారు. మృగశిరకార్తిలో పత్తి, వేరుశనగ, ఆముదం, మొక్కజొన్న, కందులు వంటి వివిధ రకాల పంటలు సాగుచేశారు. ఈ ఏడాది ఖరీఫ్‌లో మొత్తం 1,73,211 ఎకరాల్లో పంటలు సాగుచేయగా ఇందులో 1.50 లక్షల ఎకరాల్లో మెట్టపంటలు సాగుచేశారు. ఈ పంటలన్ని కూడా పూర్తిగా వర్షాధారంగానే పండుతాయి. ఇదిలాఉండగా, సాధారణంగా జూన్‌ చివర, జూలై మాసంలో సమృద్ధిగా వర్షాలు మొదలవుతాయి. అయితే ఈ సారి మే నెలలోనే వర్షాలు కురిశాయి. మే నెలలో జిల్లా వ్యాప్తంగా 117.3మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. వాస్తవానికి మే నెలలో సాధారణ వర్షపాతం 25.8 మి.మీటర్లు కురవాల్సి ఉండగా.. అధికంగా కురిసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement