
హైదరాబాద్ చేరిన నాయకుల పంచాయితీ
గద్వాల: నియోజకవర్గంలో అధికార పార్టీలో నెలకొన్న వర్గపోరు హైదరాబాద్కు చేరింది. మంగళవారం జెడ్పీ మాజీ చైర్పర్సన్ సరిత వర్గం నాయకులు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్కుమార్గౌడ్ను కలిశారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలుపొంది కాంగ్రెస్లోకి వచ్చిన ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డికి అధిక ప్రాధాన్యత ఇస్తూ నిజమైన కాంగ్రెస్ పార్టీ నాయకులను విస్మరించడంతో పాటు అక్రమ కేసులు నమోదు చేస్తూ ఇబ్బందులు గురిచేస్తున్నట్లు ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా నామినేటెడ్ పదవులు, ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ, ఇందిరమ్మ కమిటీలలో పదవులు అన్ని కూడా ఎమ్మెల్యే వర్గానికి ఇస్తూ తీవ్ర అన్యాయం చేస్తున్నట్లు తెలిపారు. స్థానిక సంస్థలలో బీ–ఫారాలను పాత కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఇవ్వాలని, ఇదేవిషయంపై పలుమార్లు అధిష్టానానికి ఫిర్యాదు చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయిందన్నారు. పరిస్థితి ఇదేవిధంగా కొనసాగితే అన్ని మండలాల నుంచి నాయకులు, కార్యకర్తలతో కలిసి ఛలో గాంధీభవన్కు పాదయాత్ర చేపట్టాల్సి వస్తుందన్నారు కార్యక్రమంలో మాజీ మున్సిపల్ వైస్చైర్మన్ శంకర్, డీఆర్ శ్రీధర్, లత్తిపురం వెంకట్రామిరెడ్డి, వెంకటస్వామిగౌడ్, కృష్ణ, డీటీడీసీ నర్సింహులు, ఆనంద్గౌడ్, పటేల్ శ్రీనివాసులు, ప్రకాష్, మాభాషా, రాఘవేంద్రరెడ్డిలు ఉన్నారు.