
నిరుద్యోగ సమస్యలపై నిరంతర పోరాటం
అమరచింత: నిరుద్యోగ సమస్యల పరిష్కారానికి డీవైఎఫ్ఐ నిరంతరం పోరాటం చేస్తోందని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కోట రమేష్ తెలిపారు. ఆదివారం మండల కేంద్రంలో నిర్వహించిన సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిరుద్యోగ యువత జీవితాలతో చెలగాటమాడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. యువత మత్తు పదార్థాలకు బనిసై తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారని తెలిపారు. ఆన్లైన్, ఆఫ్లైన్ గేమ్ల పేరిట తల్లిదండ్రులకు తెలియకుండా అప్పులు చేసి చివరికి ఆత్మహత్యలు చేసుకుంటున్న దుస్థితి యువతరం చేరుకోవడం శోచనీయమన్నారు. కళాశాల, పాఠశాలల వద్ద జరిగే మత్తు పదార్థాల ముఠాలను అడ్డుకోనేందుకు డీవైఎఫ్ఐ ప్రణాళికతో ముందుకు సాగుతుందని చెప్పారు. కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షుడు రాఘవేంద్ర, చంటి, తిరుపతి, అశోక్, మనోహర్ తదితరులు పాల్గొన్నారు.