
రసాయనిక ఎరువుల వాడకం తగ్గించాలి
తాడూరు: రైతులు సాగు చేసే పంటల్లో యూరియాతో పాటు రసాయనిక ఎరువులను తగ్గించాలని పాలెం కేవీకే శాస్త్రవేత్తలు శ్రీరాం అన్నారు. సోమవారం మండలంలోని బలాన్పల్లిలో రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమంలో భాగంగా పంటల సాగుపై అవగాహన కల్పించారు. అనంతరం శాస్త్రవేత్త శ్రీరాం మాట్లాడుతూ పంట మార్పిడీతో భూసారం పెరుగుతుందన్నారు. విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేసినప్పుడు రశీదులు భద్రపర్చుకోవాలని సూచించారు. శాస్త్రవేత్త రాజిరెడ్డి మాట్లాడుతూ పురుగు మందులు అవసరం ఉన్నప్పుడే మాత్రం పిచికారి చేయాలన్నారు. నేల తేమ సంరక్షణ పద్ధతులపై అవగాహన కల్పించారు. అధికారులు సూచనలు, సలహాలు పాటించి అధిక దిగుబడులు సాధించాలని కోరారు కార్యక్రమంలో ఏఓ సందీప్కుమార్రెడ్డి, ఏఈఓ దీపక్, వ్యవసాయ కళాశాల విద్యార్థులు రైతులు పాల్గొన్నారు.