కేఎల్‌ఐ: మరో 1.50 లక్షల ఎకరాలకు.. | - | Sakshi
Sakshi News home page

కేఎల్‌ఐ: మరో 1.50 లక్షల ఎకరాలకు..

May 28 2025 12:25 AM | Updated on May 28 2025 12:25 AM

కేఎల్‌ఐ: మరో 1.50 లక్షల ఎకరాలకు..

కేఎల్‌ఐ: మరో 1.50 లక్షల ఎకరాలకు..

ల్వకుర్తి ఎత్తిపోతల పథకానికి 2002లో అప్పటి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబా బు శంకుస్థాపన చేసినా.. పనులు ప్రారంభం కాలేదు. ఆ తర్వాత కాంగ్రెస్‌ ప్రభుత్వలో అప్పటి సీఎం వైఎస్‌ఆర్‌ ప్రాజెక్ట్‌ నిర్మాణానికి రూ.2,990 కోట్లు కేటాయించారు. ఇందులో నాలుగు రిజర్వాయర్లు ఎల్లూరు, సింగోటం, జొన్నలబొగుడ, గుడి పల్లి నిర్మించారు. ఆ తర్వాత దాదాపు 90 శాతం పనులు పూర్తి చేశారు. వైఎస్‌ మరణానంతరం పూర్తిగా నిర్లక్ష్యం చేయబడిన ప్రాజెక్ట్‌కు తెలంగాణలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రూ.1000 కోట్లు కేటాయించి పలు పనులు చేపట్టింది. మొదట ఈ ప్రాజెక్ట్‌ ద్వారా 2.30 లక్షల ఎకరాలకు నీరందించాలనేది లక్ష్యం కాగా.. ఆ తర్వాత ఆయకట్టు 4.20 లక్షల ఎకరాలకు పెరిగింది. ఇప్పటికీ చాలా పనులు పెండింగ్‌లో ఉండడంతో రెండు లక్షల ఎకరాలకు మాత్రమే నీరందుతోంది. ఈ ఏడాది బడ్జెట్‌లో ఈ ప్రాజెక్ట్‌కు రూ.900 కోట్లు కేటాయించగా.. వచ్చే ఏడాది మార్చి నాటికి పూర్తి స్థాయి ఆయకట్టుకు సాగునీటిని అందించాలనే లక్ష్యంతో పనులు చేపట్టేలా కసరత్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement