రామప్పలో విదేశీయుల సందడి | - | Sakshi
Sakshi News home page

రామప్పలో విదేశీయుల సందడి

Oct 19 2025 6:23 AM | Updated on Oct 19 2025 6:23 AM

రామప్పలో విదేశీయుల సందడి

రామప్పలో విదేశీయుల సందడి

వెంకటాపురం(ఎం): మండలంలోని చారిత్రక రామప్ప దేవాలయాన్ని శనివారం హైదరాబాద్‌లోని ఎంసీహెచ్‌ఆర్‌డీలో శిక్షణ పొందుతున్న టాంజనియా దేశానికి చెందిన 30 మంది అధికారులు సందర్శించారు. ప్రొఫెసర్‌, కోర్స్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ రావులపాటి మాధవి ఆధ్వర్యంలో వారు రామప్ప ఆలయానికి చేరుకొని రామలింగేశ్వస్వామికి పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు హరీశ్‌ శర్మ, ఉమాశంకర్‌లు వారికి తీర్థ ప్రసాదాలు అందించి ఆశీర్వచనం చేశారు. ఆలయ విశిష్టత, శిల్పకళ ప్రాముఖ్యత గురించి టూరిజం గైడ్‌ గోరంట్ల విజయ్‌ కుమార్‌ వివరించగా రామప్ప శిల్పకళ సంపద బాగుందని వారు కొనియాడారు. అనంతరం రామప్ప సరస్సును సందర్శించి సరస్సులో బోటింగ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో వారి వెంట ఎంసీహెచ్‌ఆర్‌డీ అధికారులు రవి, సాయికృష్ణ, నందకిశోర్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement