
దాడి అమానుషం
నిజాలను నిర్భయంగా రాస్తూ ఎన్నో అవినీతి అక్రమాలను వెలికి తీస్తున్న సాక్షి దిన పత్రిక ఎడిటర్, జర్నలిస్టుల మీద ఆంధ్రప్రదేశ్లోని కూటమి ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టడం అమానుషం. తెలంగాణ సామాజిక రచయితల సంఘం ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తుంది. అక్రమ కేసులను ఎత్తేయాలి. భావప్రకటన స్వేచ్ఛకు సంకెళ్లు సమంజసం కాదు. రాజ్యాంగం కల్పించిన స్వేచ్ఛను అడ్డుకోరాదు. పౌర సమాజం ఈ ఘటనను ఖండించాలి.
– కామిడి సతీష్రెడ్డి, తెలంగాణ సామాజిక
రచయితల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు